ఫ్లూట్‌ శబ్ధం వింటే కోపం తగ్గుతుంది..

అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. ప్రతి గురువారం ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించిన సరికొత్త ప్రోమో విడుదలయ్యింది. ఇందులో తాగుబోతు రమేష్‌, నరేష్‌ భార్యాభర్తలుగా కనిపిస్తారు. అయితే రమేష్‌కి...

Published : 26 Oct 2020 13:05 IST

 

హైదరాబాద్‌: అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కామెడీ షో ‘జబర్దస్త్‌’. వచ్చే గురువారం ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించిన సరికొత్త ప్రోమో విడుదలయ్యింది. ఇందులో తాగుబోతు రమేష్‌, నరేష్‌ భార్యాభర్తలుగా కనిపిస్తారు. అయితే రమేష్‌కి ప్రశాంతత అంటే ఎంతో ఇష్టం. కాకపోతే ఆయనకి మాత్రం ఊరికే కోపం వచ్చేస్తుంటుందని, ఫ్లూట్‌ శబ్ధం వింటే వెంటనే కోపం తగ్గిపోతుందని, అందుకే మెడలో మాంగల్యంతోపాటు ఫ్లూట్‌ని కూడా వేసుకున్నానని చెబుతూ నరేష్‌ ఎమోషన్‌ అవుతాడు. అయితే నరేష్‌ పలికించిన హావభావాలతో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న రోజా, మనో నవ్వుకుంటారు. మరోవైపు హైపర్‌ ఆది సైతం ఎప్పటిలాగానే వరుస పంచులతో కడుపుబ్బా నవ్వించారు. అక్టోబర్‌ 29న ప్రసారం కానున్న ‘జబర్దస్త్‌’ ప్రోమో చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని