Jagapathibabu: ‘గోపిచంద్‌ 30’ కోసం..

గోపిచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రంలో నటుడు జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Updated : 13 Feb 2022 11:29 IST

గోపిచంద్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రంలో నటుడు జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ విషయాన్ని  అధికారికంగా ప్రకటించింది. ‘‘గోపిచంద్‌ నటిస్తున్న 30వ చిత్రమిది. ఆయన శైలికి తగ్గట్లుగా సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమాలో గోపిచంద్‌ సరికొత్తగా కనిపించనున్నారు. మరిన్ని విషయాలు త్వరలో తెలియజేస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు. వెట్రీ పళనిస్వామి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని