Puneeth Rajkumar: పునీత్‌ జయంతికి ‘జేమ్స్‌’

కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం ‘జేమ్స్‌’. చేతన్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. కిశోర్‌ పత్తికొండ నిర్మాత. పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతిని పురస్కరించుకుని ఈనెల 17న

Updated : 11 Mar 2022 13:13 IST

న్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం ‘జేమ్స్‌’. చేతన్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. కిశోర్‌ పత్తికొండ నిర్మాత. పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతిని పురస్కరించుకుని ఈనెల 17న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. తెలుగు కథానాయకుడు శ్రీకాంత్‌ ముఖ్యభూమిక పోషించిన ఈ సినిమాని ఆయనే విజయ్‌.ఎమ్‌తో కలిసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘‘కన్నడ ప్రేక్షకుల  హృదయాల్లో నిలిచిపోయిన పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇందులో ఓ ఆర్మీ అధికారిగా కనిపిస్తారు. శ్రీకాంత్‌ ప్రతినాయకుడిగా  నటించారు. ఇటీవల విడుదల చేసిన పాటలకి, ప్రచార చిత్రాలకి చక్కటి స్పందన లభించింది. చిత్రం తప్పకుండా ప్రేక్షకుల మనసుల్ని దోచేస్తుంద’’న్నాయి చిత్రవర్గాలు. శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, ప్రియా ఆనంద్‌, శరత్‌కుమార్‌, ముఖేష్‌ రుషి తదితరులు  నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: స్వామి జె.గౌడ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని