కాబోయేవాడితో కాజల్‌ సెలబ్రేషన్స్‌.. వైరల్‌

అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌ తన భర్తతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా మొదటిసారి అభిమానులతో పంచుకున్నారు. తన ప్రియనేస్తం గౌతమ్‌ కిచ్లూతో త్వరలో ఏడడుగుల వేయనున్నానని కాజల్‌ అక్టోబర్‌ ఆరంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి శుభవార్త చెప్పడానికి....

Published : 26 Oct 2020 13:48 IST

తొలిసారి ఫొటోలు షేర్‌ చేసిన చందమామ

హైదరాబాద్‌: అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌ తనకు కాబోయే భర్తతో దిగిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా మొదటిసారి అభిమానులతో పంచుకున్నారు. తన ప్రియనేస్తం గౌతమ్‌ కిచ్లూతో త్వరలో ఏడడుగుల వేయనున్నానని కాజల్‌ అక్టోబర్‌ ఆరంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి శుభవార్త చెప్పడానికి ముందు, ఆ తర్వాత కానీ కాజల్‌ తనకు కాబోయేవాడితో దిగిన ఫొటోలు షేర్‌ చేయలేదు. దీంతో ఈ జంట లేటస్ట్‌ ఫొటోలు చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

తాజాగా కాజల్‌.. గౌతమ్‌ కిచ్లూతో దసరా వేడుకలు జరుపుకొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఫొటోలకు పోజులిచ్చారు. వీటిని ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. ‘మా తరఫున మీ అందరికీ దసరా శుభాకాంక్షలు’ అని తెలిపారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ‘సూపర్‌ కపుల్‌, మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకూ ఈ ఫొటోలను ఆరు లక్షల మంది వీక్షించారు. మరోవైపు కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌ సైతం కాబోయే బావగారితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. అలాగే గౌతమ్‌ సైతం సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటో షేర్‌ చేస్తూ.. ‘ప్రీ వెడ్డింగ్‌ పెస్టివల్స్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

తెలుగులో తెరకెక్కుతోన్న ‘మోసగాళ్లు’ చిత్రంలో కాజల్‌ నటిస్తున్నారు. దీంతోపాటు చిరంజీవి కథానాయకుడిగా రానున్న ‘ఆచార్య’ సినిమాలో కాజల్‌ సందడి చేయనున్నారు. అయితే పెళ్లి అనంతరం తాను సినిమాల్లోనే కొనసాగుతానని కాజల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని