కంగన చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ప్రభుత్వం ఆమెకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ముంబయి: అధికార శివసేన పార్టీతో ఢీకొంటున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఆమె కార్యాలయం కూల్చివేత అనంతరం.. ప్రభుత్వం ఆమెకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. అమెను మాదకద్రవ్యాల కేసులో విచారించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు నటిపై డ్రగ్స్ కేసులో దర్యాప్తు ప్రారంభించినట్టు ముంబయి పోలీసులు వివరించారు. కంగనకు మాదక ద్రవ్యాలతో సంబంధముందంటూ గతంలో ఓ నటుడు చేసిన ఆరోపణల ఆధారంగా.. కంగనపై విచారణకు హోంశాఖ లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేసింది.
ప్రముఖ టీవీ, సినిమా నటుడు శేఖర్ సుమన్ కుమారుడు అధ్యాయన్ సుమన్.. ఒకప్పుడు కంగనకు సన్నిహితుడు. గతంలో కంగన తనను కూడా డ్రగ్స్ తీసుకోవాల్సిందిగా కోరినట్టు ఆరోపించారు. అయితే, ఇప్పుడు తన పేరును వివాదాల్లోకి లాగవద్దంటూ అధ్యాయన్ సామాజిక మాధ్యమాల ద్వారా విజ్ఞప్తి చేశారు. 2016లో మీడియా తనను ఇబ్బందులకు గురిచేసిందని.. అనేక కష్టనష్టాలకు ఓర్చి ఇప్పుడిప్పుడే తన కెరీర్ను నిర్మించుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇక ఈ విషయంపై తాను స్పందించేందుకు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
సుశాంత్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో.. ముంబయి పాక్ ఆక్రమిత కశ్మీరులా అనిపిస్తోందన్న కంగనా రనౌత్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అనేక నాటకీయ పరిణామాల అనంతరం.. బుధవారం కంగన కార్యాలయం కూల్చివేత ఘటన చోటుచేసుకుంది. ఇందుకు మండిపడ్డ కంగన, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని ఏకవచనంతో సంబోధిస్తూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన వీడియో సంచలనం సృష్టించింది. ‘‘ఉద్ధవ్ ఠాక్రే.. నువ్వు ఏమనుకుంటున్నావు? మూవీ మాఫియాతో కలిసి నా ఇల్లు నాశనం చేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాను అనుకుంటున్నావా? ఈ రోజు నా ఇల్లు నాశనమైంది.. రేపు నీ గర్వం నాశనమౌతుంది..’’ అంటూ కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయం కూల్చివేత.. ఇప్పుడు తాజా డ్రగ్స్ కేసు... ఇవన్నీ అధికార పార్టీ కక్షసాధింపు చర్యలే అని కంగన విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!