ముంబయిపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు
ఎవరికైనా ధైర్యముంటే నన్ను ఆపండి..’’అని ‘క్వీన్’ కంగనా రనౌత్ ప్రకటించటం కొసమెరుపు.
సోనూ సూద్తో సహా స్పందించిన బాలీవుడ్..
ఇంటర్నెట్ డెస్క్: వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. కరోనా వైరస్ నేపథ్యంలో కంగన ప్రస్తుతం మనాలిలోని తన సొంత ఇంట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల సుశాంత్ సింగ్ మృతి కేసు గురించి మాట్లాడుతూ.. మూవీ మాఫియా కంటే ముంబయి పోలీసులంటేనే తనకు ఎక్కువ భయంగా ఉందని విమర్శించారు. దీనితో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఆమెను ముంబయి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోవాలని సూచించారు. ఇందుకు స్పందించిన కంగన ఇది తనను బహిరంగంగా బెదిరించడమేనని.. ముంబయి పాక్ ఆక్రమిత కశ్మీరులా (పీఓకే) అనిపిస్తోందని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ తారలు ఈ విధంగా స్పందించారు...
సోనూ సూద్
‘‘ఈ నగరం తలరాతలను మారుస్తుంది. దీనికి నమస్కారం చేస్తే, పురస్కారమే లభిస్తుంది.’’
రితేశ్ దేశ్ముఖ్
‘‘ముంబయి భారత దేశంలో ఉంది.’’
ఊర్మిళా మంతోడ్కర్
‘‘శివాజీ మహారాజు నేల మహారాష్ట్ర. లక్షలాది మందికి తిండి పెట్టింది. వారికి పేరు, ప్రతిష్ఠలనిచ్చింది. కృతజ్ఞత లేనివారే దీనిని పీఓకే తో పోల్చగలరు. షాక్కు, అసహనానికి గురయ్యాను. అయిందేదో అయింది.. ముంబయి మనది.’’
దియా మీర్జా
‘‘ముంబయి నా ప్రాణం. 19 ఏళ్ల వయసులో ఇక్కడికి వచ్చిన నేను.. 20 ఏళ్లకు పైగా ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పనిచేశాను. ఈ నగరం నన్ను చేతులు చాచి మరీ దగ్గరకు తీసుకుంది. నాకు రక్షణ నిచ్చింది. ఇది విశ్వనగరం, అందరినీ కలుపుకొనిపోతుంది, విభిన్నమైనది, అందమైనది.’’
స్వరా భాస్కర్
‘‘ఓ బయటి వ్యక్తిగా, స్వతంత్ర్య భావాలున్న ఉద్యోగిగా ముంబయిలో గత దశాబ్దం నుంచి ఉంటున్నాను. నివసించటానికి, పనిచేసుకునేందుకు అనువైన, సురక్షితమైన నగరాల్లో ముంబయి ఒకటి. మన ముంబయిని సురక్షితంగా ఉంచేందుకు మీ నిరంతర కృషి, సేవలకు థాంక్యూ ముంబయి పోలీస్.
రేణుకా సహానే
‘‘ప్రియమైన కంగనా! ముంబయి బాలీవుడ్ స్టార్ కావాలనే నీ ఆశను నెరవేర్చిన నగరం. ఈ అద్భుతమైన నగరం పట్ల కాస్తయినా గౌరవం కలిగి ఉండాలని ఆశిస్తాం. దీనిని నువ్వు పీఓకే తో పోల్చటం భయంకరం.’’
అయితే.. ‘‘నేను సెప్టెంబరు 9న ముంబయికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు ముంబయి విమానాశ్రయంలో దిగగానే సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తాను. ఎవరికైనా ధైర్యముంటే నన్ను ఆపండి..’’అని ‘క్వీన్’ కంగనా రనౌత్ ప్రకటించటం కొసమెరుపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!