KritiSanon: ఇలా ముందెప్పుడూ లేదు!

బాలీవుడ్‌లో దక్షిణాది చిత్రాల జోరు కొనసాగుతోంది. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’ల నుంచి ఇటీవల వచ్చిన ‘పుష్ప’ వరకు.. ఇవన్నీ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించాయి. అయితే ఇప్పుడు దక్షిణాది

Updated : 14 Mar 2022 14:06 IST

బాలీవుడ్‌లో దక్షిణాది చిత్రాల జోరు కొనసాగుతోంది. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’ల నుంచి ఇటీవల వచ్చిన ‘పుష్ప’ వరకు.. ఇవన్నీ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించాయి. అయితే ఇప్పుడు దక్షిణాది చిత్రాలకు.. ఉత్తరాది సినిమాలకు మధ్య కనిపిస్తున్న ఈ పోటీ వాతావరణం చాలా బాగుందంది నటి కృతిసనన్‌. నిజానికి దీన్ని తాను పోటీగా చూడటం లేదని,  ఇది చాలా ఆరోగ్యకరమైన వాతావరణమని పేర్కొంది. ‘‘ఈరోజు ప్రతి ఇండస్ట్రీలోనూ చాలా బహుభాషా చిత్రాలు నిర్మితమవుతున్నాయి. ఇది ఇంతకు ముందెప్పుడూ లేదు. గతంలో సాంకేతిక నిపుణులే అన్ని చిత్రసీమల్లోనూ పనిచేసేవారు. ఇప్పుడిది నటీనటుల విషయంలోనూ జరుగుతోంది. ప్రాంతీయ, భాషా హద్దులు  చెరిపేస్తూ.. తమ ప్రతిభను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు. నిజంగా ఈ స్నేహపూరిత వాతావరణం చాలా బాగుంది’’ అని కృతి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె, అక్షయ్‌ కుమార్‌ జంటగా నటించిన ‘బచ్చన్‌ పాండే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని