LIGER: ‘లైగర్‌’.. చివరి అంకం

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్నారు. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్య పాండే కథానాయిక. రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, అలీ తదితరులు

Updated : 05 Feb 2022 06:54 IST

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్నారు. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్య పాండే కథానాయిక. రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, అలీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ శుక్రవారం ముంబయిలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. ప్రస్తుతం విజయ్‌తో పాటు మిగిలిన ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు    తెలిపారు. మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ముంబయిలో చాయ్‌ వాలాగా జీవిత ప్రయాణాన్ని మొదలు పెట్టిన కుర్రాడు..ఛాంపియన్‌గా ఎలా ఎదిగాడన్నది చిత్ర కథాంశం. ఈ పాత్ర కోసం విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. ఇందులో లెజెండ్‌ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టంట్‌  డైరెక్టర్‌: కెచ్చా, కూర్పు: జునైద్‌ సిద్దిఖీ, ఛాయాగ్రహణం:


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని