ఎస్పీబీ మృతి పట్ల బాలీవుడ్ సంతాపం
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తన మధుర గాత్రంతో ఇన్నాళ్లూ మ్యాజిక్ చేసిన ఆయన ఇకపై కూడా పాటల రూపంలో మనతోనే ఉంటారని పేర్కొన్నారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, ప్రముఖ నటులు అనిల్ కపూర్, షారుక్ ఖాన్....
ముంబయి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. తన మధుర గాత్రంతో ఇన్నాళ్లూ మ్యాజిక్ చేసిన ఆయన ఇకపై కూడా పాటల రూపంలో మనతోనే ఉంటారని పేర్కొన్నారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్, ప్రముఖ నటులు అనిల్ కపూర్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, అజయ్ దేవగణ్ తదితరులు సోషల్ మీడియా వేదికగా బాలుకు నివాళులర్పించారు.
లతా మంగేష్కర్: ప్రతిభాశాలి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయనతో కలిసి పలు గీతాలు ఆలపించా. షోలలో పాల్గొన్నా. ఆయన ఇకలేరనే వార్త నన్ను బాధిస్తోంది.
షారుక్ ఖాన్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సర్ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. లెజెండరీ గాయకుడి ఆత్మకు శాంతి చేకూరాలి. మీ మధుర స్వరాన్ని మేం మిస్ అవుతున్నాం.
అక్షయ్ కుమార్: బాలసుబ్రహ్మణ్యం జీ మరణవార్త నన్నెంతో బాధించింది. ఈ లాక్డౌన్లో కొన్ని నెలల క్రితం ఓ కాన్సర్ట్ కోసం బాలసుబ్రమణ్యం గారితో ఆన్లైన్లో మాట్లాడా. ఆయన చాలా ఆరోగ్యంగా ఎప్పటిలాగే కనిపించారు. నిజంగా జీవితాన్ని మనం ఊహించలేం.. ఈ బాధను తట్టుకునే శక్తిని దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కోరుకుంటున్నా.
అనిల్ కపూర్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ గొప్ప వ్యక్తి.. అద్భుతమైన గాయకుడు. ఆయన నా పాత్రలకు డబ్బింగ్ చెప్పడం నా అదృష్టం. నా తొలి తెలుగు, కన్నడ సినిమాల్లోని పాత్రలకు ఆయన స్వరం ఇచ్చారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.
సల్మాన్ ఖాన్: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సర్ గురించి తెలిసిన తర్వాత నా గుండె పగిలింది. మీరు సంగీత ప్రపంచానికి చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
బోనీ కపూర్: ఇవాళ ఓ లెజెండ్ను కోల్పోయాం. దాదాపు 16 భాషల్లో వేల గీతాలు ఆలపించారు. ఆయన స్వరం.. తరం, ప్రాంతం అనే తేడా లేకుండా సంగీత ప్రియుల్ని ఒక్కటి చేసింది. మీరు చిత్ర పరిశ్రమకు చేసిన సేవ.. మా జ్ఞాపకాల్లో మిమ్మల్ని ఎప్పటికీ జీవంతోనే ఉంచుతుంది. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.
ఆమిర్ ఖాన్: బాలసుబ్రహ్మణ్యం గారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. మనం ఓ గొప్ప ఆర్టిస్టును కోల్పోయాం. దీన్ని తట్టుకునే శక్తి దేవుడు ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా.
అజయ్ దేవగణ్: నా కెరీర్ ఆరంభం నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి స్వరం, పాటలు అందర్నీ ఎంతో అలరించాయి. అంతకు ముందు కూడా ఆయన లెజెండే. ఆయన ఇకలేరనే వార్తను తట్టుకోలేకపోతున్నా. కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా.
వివేక్ ఒబెరాయ్: ఈ ఏడాది చిత్ర పరిశ్రమకు చెందిన కొంత మంది లెజెండ్స్ను మనం కోల్పోయాం. సంగీత పరిశ్రమ కూడా మరో గొప్ప గాయకుడ్ని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా.
హేమ మాలిని: ఓ శకం ముగిసింది. గాన గంధర్వుడు కన్నుమూశారు. బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో మరణించారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నా. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం.
మాధురీ దీక్షిత్: మీ స్వరం మిమ్మల్ని మాకెప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీ. పాటలతో మీరు చేసిన మ్యాజిక్ ఎంతో గొప్పది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
రితేష్ దేశ్ముఖ్: అద్భుతమైన పాటలు మాకిచ్చినందుకు ధన్యవాదాలు జీ. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, కోట్లాది మంది అభిమానులకు నా సానుభూతి తెలుపుతున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి