ఆకట్టుకుంటోన్న ‘లూడో’ ట్రైలర్‌

దేశవ్యాప్తంగా పలుచోట్ల థియేటర్లు తెరుచుకున్నప్పటికీ కరోనా కారణంగా ప్రేక్షకులు మాత్రం వాటిపై మొగ్గు చూపడం లేదు. దీంతో చాలా వరకూ సినిమాలు ఓటీటీ వేదికగానే విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోన్న క్రమంలో తాజాగా మరో బాలీవుడ్‌ చిత్రం....

Published : 19 Oct 2020 17:18 IST

ముంబయి: దేశవ్యాప్తంగా పలుచోట్ల థియేటర్లు తెరుచుకున్నప్పటికీ కరోనా కారణంగా ప్రేక్షకులు మాత్రం వాటిపై మొగ్గు చూపడం లేదు. దీంతో చాలా వరకూ సినిమాలు ఓటీటీ వేదికగానే విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోన్న క్రమంలో తాజాగా మరో బాలీవుడ్‌ చిత్రం అదేబాటలో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యింది.

అభిషేక్‌ బచ్చన్‌, రాజ్‌కుమార్‌ రావు, పంకజ్‌ త్రిపాఠి, ఆదిత్యా రాయ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లూడో’. అనురాగ్‌ బసు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కాగా, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో అభిషేక్‌ బచ్చన్‌తోపాటు ఇతర నటీనటుల నటన ఆకట్టుకునేలా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు