Kandikonda: గువ్వను.. మువ్వనూ పాడమన్న కలం మూగబోయింది
‘మళ్లీ కూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వ’ అంటూ గువ్వను, మువ్వను పాడమని అడిగిన ఆ కలం మూగబోయింది. ఆహ్లాదకరమైన, ఆదర్శమైన పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత కందికొండ(49)
అనారోగ్యంతో పాటల రచయిత ‘కందికొండ’ మృతి
‘మళ్లీ కూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వ’ అంటూ గువ్వను, మువ్వను పాడమని అడిగిన ఆ కలం మూగబోయింది. ఆహ్లాదకరమైన, ఆదర్శమైన పాటలు రాసిన ప్రముఖ గేయ రచయిత కందికొండ(49) కన్నుమూశారు. ఆయన అసలు పేరు కందికొండ యాదగిరి. పదేళ్లుగా క్యాన్సర్తో బాధపడుతూ శనివారం హైదరాబాద్లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆర్థిక ఇబ్బందులు వెన్నాడుతున్నా.. స్నేహితుల సహకారంతో క్యాన్సర్కు చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత వెన్నెముక సమస్య ఇబ్బంది పెట్టడంతో శస్త్ర చికిత్స చేయించు కున్నారు. అయినా క్యాన్సర్ మహమ్మారి ప్రభావం ఆయన్ను మృత్యుఒడిలోకి నెట్టింది. తెలంగాణలో ప్రముఖ గేయ రచయితగా కందికొండ బోనాల పాటలతో జానపదాలను జనంలోకి తీసుకువెళ్లగలిగారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కందికొండ ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్ చదివారు. ఆయనకు భార్య రమ, ఇద్దరు పిల్లలు ప్రభంజన్, మాతృక ఉన్నారు. తెలుగు సాహిత్యం, రచనలపై తనకున్న ఆసక్తితో సినీ రంగం వైపు అడుగులు వేశారు. కందికొండకు ఇంటర్ చదువుతున్నప్పుడు సినీ సంగీత దర్శకుడు చక్రితో స్నేహం ఏర్పడింది. 2001లో పూరీ జగన్నాథ్ తీసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’లో ‘మళ్లీ కూయవే గువ్వా’ ఆయన తొలి గీతం. ఆ తర్వాత ‘ఇడియట్’, ‘సత్యం’, ‘పోకిరి’, ‘టెంపర్’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ తదితర చిత్రాల్లో హుషారెత్తించే పాటలు రాశారు. 2018లో ‘నీది నాది ఒకే కథ’లో రెండు పాటలు రాశారు. ఇటీవల ‘కోతలరాయుడు’ చిత్రానికి రాసిన పాట ఆఖరిది.
బతుకమ్మ పాటలతో...
సినిమా గీతాలతో పాటు బతుకమ్మ పాటలు, జానపదాలు రాయడంలో కందికొండ దిట్ట. తొలుత ఆయన ఈ పాటలతోనే అభిమానులను సంపాదించుకున్నారు. 25 ఏళ్ల కిందట హైదరాబాద్కు వచ్చి, కల్యాణ్నగర్లో స్థిరపడ్డారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గత కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనా సమయంలో ఆయన కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కందికొండకు చికిత్స అందించారు. అయినా ఫలితం లేకపోయింది. ఇంటికే పరిమితమైన ఆయనకు శ్వాస ఆడకపోవడంతో శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం
‘తన పాట ద్వారా తెలంగాణ సంస్కృతిని అజరామరంగా నిలిపారు కందికొండ. ఆయన మరణం సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు లోటు. కందికొండను కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్, సినీ పరిశ్రమకు చెందిన పలువురు కందికొండ మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- న్యూస్టుడే, అమీర్పేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్