థియేటర్లు తెరవగానే మహేశ్‌ చిత్రం రిలీజ్‌..!

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో సినిమా రంగంలో సందడి తగ్గింది. అయితే ఆన్‌లాక్‌ నిబంధనల్లో భాగంగా అక్టోబర్‌ 15న నుంచి 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాహాళ్లు ఓపెన్‌ చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం అంగీకారం తెలిపింది.

Updated : 15 Oct 2020 11:27 IST

రేసులో నితిన్‌, అల్లు అర్జున్‌
 

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో సినిమా రంగంలో సందడి తగ్గింది. అయితే అన్‌లాక్‌ నిబంధనల్లో భాగంగా అక్టోబర్‌ 15వ తేదీ నుంచి 50శాతం సీట్లను భర్తీ చేస్తూ సినిమాహాళ్లు తెరవడానికి‌ చేసుకోవడానికి కేంద్రప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో దాదాపు ఆరు నెలల తర్వాత ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు వచ్చే విధంగా లాక్‌డౌన్‌కి ముందు ప్రేక్షకుల్ని అలరించిన పలు సూపర్‌హిట్‌ చిత్రాలను మరోసారి థియేటర్లలో విడుదల చేయనున్నారు.

కాగా, థియేటర్లు ఓపెన్‌ కాగానే.. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్‌ విజయాన్ని అందుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’(తమిళ్‌డబ్బింగ్‌‌) చిత్రాన్ని చెన్నైలో మొదటి సినిమాగా ప్రదర్శించనున్నారు. మరోవైపు నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘భీష్మ’, అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘అల..వైకుంఠపురములో’ సినిమాలను సైతం బెంగళూరులోని పలు థియేటర్లలో స్ర్కీనింగ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుకింగ్‌లు కూడా ప్రారంభించారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పునఃప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు