మహేశ్-నమ్రతలను కలిపిన చిత్రానికి 20ఏళ్లు
వెండితెరపై నటీనటులుగా సందడి చేసి, ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన వారిలో మహేశ్బాబు-నమ్రత శిరోద్కర్ జోడీ ఒకటి. వీరిద్దరూ తొలి ‘వంశీ’ చిత్రం కోసం
ఇంటర్నెట్ డెస్క్: వెండితెరపై నటీనటులుగా సందడి చేసి, ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటైన వారిలో మహేశ్బాబు-నమ్రత శిరోద్కర్ జోడీ ఒకటి. వీరిద్దరూ తొలిసారి ‘వంశీ’ చిత్రం కోసం కలిసి పనిచేశారు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై (అక్టోబరు 4, 2000) ఆదివారానికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే మహేశ్-నమ్రత ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత దాదాపు ఐదేళ్లకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
కథేంటి: వంశీ (మహేష్ బాబు) ఓ ఫ్యాషన్ డిజైనర్. ఓ కాంపిటేషన్లో భాగంగా తన సహోద్యోగి స్నేహ (మయూరి కాంగో)తో కలిసి ఆస్ట్రేలియా వెళ్తాడు. అక్కడ వంశీ డిజైన్లకు మోడలింగ్ చేసేందుకు స్నేహ ఎంపికవుతుంది. పారిశ్రామికవేత్త అయిన అంకినీడు ప్రసాద్ (నాజర్) కుమార్తె శిల్ప(నమ్రత). పరీక్షలు అయిపోవడంతో ఆస్ట్రేలియా పర్యటనకు వస్తుంది. అదే సమయంలో అనుకోకుండా వంశీని కలుస్తుంది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగి, ఒకరినొకరు ప్రేమించుకుంటారు. సరిగ్గా అదే సమయంలో స్నేహ గాయపడటంతో వంశీ డిజైన్ చేసిన దుస్తులు ధరించి ప్రదర్శన ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోతుంది. ఈ విషయం తెలిసిన శిల్ప ఆ దుస్తులను ధరించి పోటీల్లో పాల్గొని వంశీ దుస్తులకు ప్రథమ బహుమతి వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ భారత్కు తిరిగి వస్తారు. తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో శిల్ప తండ్రి వంశీని హెచ్చరిస్తాడు. అయితే, శిల్ప-వంశీలు పారిపోయి గుడిలో వివాహం చేసుకుందామనే సమయానికి అర్జున్ (కృష్ణ) శిల్పను కిడ్నాప్ చేస్తాడు. అసలు అర్జున్ ఎందుకు ఈ కిడ్నాప్ చేశాడు? శిల్పను వంశీ కాపాడాడా? చివరికి వివాహం చేసుకున్నాడా? అన్నది కథ.
మణిశర్మ పాటలు అలరించినా, ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. అయితే, ఈ చిత్ర షూటింగ్లోనే మహేశ్-నమ్రత ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఫిబ్రవరి 10, 2005లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి గౌతమ్, సితార జన్మించారు.
అలా మొదలైంది!
‘వంశీ’ చిత్రీకరణ కోసం న్యూజిలాండ్ వెళ్లింది చిత్ర బృందం. అక్కడ సుమారు 25 రోజులు షూటింగ్ చేశారు. అప్పటివరకూ నమ్రత అన్ని రోజులు అవుట్డోర్ (విదేశాల్లో) షూటింగ్ చేయలేదట. ఇక మహేశ్కు కాస్త సిగ్గు ఎక్కువ. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అయితే, నమ్రతతో మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత వారి మధ్య స్నేహం చిగురించింది. సెట్లో ఎక్కువసేపు కలిసి కబుర్లు చెప్పుకొనేవారు. న్యూజిలాండ్ నుంచి వచ్చిన తర్వాత వారి మధ్య ఉన్నది స్నేహం కాదని, ప్రేమని తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ఒకరోజు సడెన్గా మహేశ్కు నమ్రత ఫోన్ చేసిన తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే ఆమె అంటే ఇష్టమున్న మహేశ్కు కూడా ఓకే చెప్పేశారు.
అందుకే పెళ్లికి నాలుగేళ్లు
‘వంశీ’ సినిమా సమయంలోనే నమ్రత మరికొన్ని చిత్రాలను కూడా ఒప్పుకొన్నారు. దీంతో పెళ్లికి ముందే తన సినిమాలన్నీ పూర్తి చేయాలనుకున్నారు. అదే సమయంలో మహేశ్కు ‘వంశీ’ మూడో సినిమా కావడంతో కెరీర్లో ఇంకాస్త కుదురుకునే వరకూ వేచి చూడాలని ఇద్దరూ భావించారు. ఈలోగా నమ్రత అంగీకరించిన సినిమాలను పూర్తి చేసి, పెళ్లి పీటలెక్కారు. పెళ్లి తర్వాత నటించాలా? వద్దా? అన్న దానిపై కూడా అప్పుడే నమ్రత ఒక నిర్ణయానికి వచ్చారు. తాను కూడా సినిమాలు చేస్తే, కుటుంబానికి ఎక్కడ దూరం కావాల్సి ఉంటుందోనని పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.
అందుకే మహేశ్ అంటే అంత ప్రేమ
‘‘కుటుంబం కోసం మహేశ్ ఏదైనా చేస్తారు. తల్లిదండ్రుల్ని అమితంగా ప్రేమిస్తారు. అదే విధంగా పిల్లల్ని ప్రేమించే గొప్ప తండ్రి కూడా. జీవిత భాగస్వామికి ఎప్పుడూ తోడుగా నిలుస్తారు. మా అమ్మానాన్నలు చనిపోతే ‘ఖలేజా’ షూటింగ్కు కొన్నాళ్లు విరామం తీసుకొని మరీ నాకు అండగా నిలిచారు. వీటన్నింటికీ మించి గొప్ప మానవతా వాది. అందుకే మహేశ్ అంటే నాకు అంత ప్రేమ, ఆరాధన. మహేశ్ను కలవడం జీవితంలో నాకు దక్కిన పెద్ద అదృష్టం. నా పెళ్లే నాకు దక్కిన బహుమతుల్లో అత్యంత ప్రత్యేకమైంది’’ - ఓ సందర్భంలో మహేశ్ గురించి నమ్రత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నా భార్యకు ఏమైనా అయితే.. పాక్ ఆర్మీ చీఫ్కు ఇమ్రాన్ఖాన్ వార్నింగ్
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..