లద్దాఖ్ రోడ్లపై ‘పేటా’ నటి బైక్ రైడ్
లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన నటి మాళవికా మోహన్ తన ట్రావెలింగ్ డైరీస్కు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నారు. తనకెంతో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై లద్దాఖ్ రోడ్లలో విహరించడం సంతోషాన్నిచ్చిందని ఆమె తెలిపారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా....
వైరల్గా మారిన ఫొటోలు
తిరువనంతపురం: లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మలయాళీ నటి మాళవికా మోహన్ తన ట్రావెలింగ్ డైరీస్కు సంబంధించిన కొన్ని మధుర జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నారు. తనకెంతో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై లద్దాఖ్ రోడ్లలో విహరించడం సంతోషాన్నిచ్చిందని ఆమె తెలిపారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా ఆనాటి బైక్రైడ్కు సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. దీంతో సదరు ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.
‘అత్యంత ఉత్కంఠభరితమైన క్షణాలతోపాటు లద్దాఖ్లోని అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను నేను ఆస్వాదించాను. కొంగొత్త అద్భుతాలను అన్వేషిస్తూ బైక్ రైడ్ చేయడంతో గత కొన్ని సంవత్సరాల నుంచి హిమాలయాలు నాకెంతో ఇష్టమైన ప్రదేశంగా మారాయి. అందరూ కారులో ప్రయాణించడానికి ఆసక్తి కనబరుస్తారు. కానీ బైక్పై ప్రయాణం చేస్తే.. గాల్లో విహరించినట్లు ఉంటుంది. చిరుగాలిని సైతం మనం పూర్తిగా ఆస్వాదించవచ్చు. అలాగే బైక్రైడ్ సమయంలో నా మోముని తాకిన మంచు బిందువులను ఇప్పటికీ నేను ఆస్వాదించగలుగుతున్నాను. త్వరితగతిన పరిస్థితులు చక్కబడితే బైక్ రైడ్కి వెళ్లాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.’ అని మాళవిక తెలిపారు. అయితే మాళవిక పెట్టిన పోస్ట్కు అమలాపాల్ ఫిదా అయ్యారు. ‘వాట్ ఏ క్రేజీ. ఈసారి మనిద్దరం కలిసి వెళ్దాం’ అని రిప్లై ఇచ్చారు.
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘పేటా’ చిత్రంలో మాళవికా మోహన్ ఓ కీలకపాత్ర పోషించారు. ఆ సినిమా విజయంతో ఆమె విజయ్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్’ చిత్రంలో మాళవిక హీరోయిన్గా నటించారు. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో