హీరో ఛాలెంజ్.. 275 రోజులు ఇంట్లోనే..!
మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి తనకు తానే ఛాలెంజ్ చేసుకున్నారు. లాక్డౌన్, కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో వీలైనన్ని రోజులు ఇంట్లోనే గడపాలని దృఢంగా నిశ్చియించుకున్నారు. మార్చి నుంచి తన నివాసాన్ని వదిలి బయటికి రాకపోవడం విశేషం. దాదాపు తొమ్మిది నెలల తర్వాత (275 రోజులు) ఆయన ఇంటి....
తొలిసారి బయటికొచ్చిన మమ్ముట్టి.. వీడియో వైరల్
కొచ్చి: మాలీవుడ్ స్టార్ మమ్ముట్టి తనకు తానే ఛాలెంజ్ విసురుకున్నారు. లాక్డౌన్, కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో వీలైనన్ని రోజులు ఇంట్లోనే గడపాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. మార్చి నుంచి తన నివాసాన్ని వదిలి బయటికి రాకపోవడం విశేషం. దాదాపు తొమ్మిది నెలల తర్వాత (275 రోజులు) ఆయన ఇంటి నుంచి అడుగు బయట పెట్టారు. డిసెంబరు 5న సాయంత్రం వేళ స్నేహితులు, దర్శకుడు ఆంటో జోసెఫ్, ప్రొడక్షన్ కంట్రోలర్ బాదుషా, నటుడు రమేశ్తో కలిసి సరదాగా బయటికి వెళ్లి ఛాయ్ తాగారు. కలూర్ స్టేడియం వద్ద వీరు ఉండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఏడాది ఆరంభంలో మమ్ముట్టి తన తర్వాతి సినిమా ‘ప్రేయిస్ట్’ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కేరళలోని కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు. మార్చిలో లాక్డౌన్ విధించిన తర్వాత కనీసం నిత్యావసర సరకుల కోసమూ ఇల్లు వదిలి బయటికి వెళ్లలేదు. తన తండ్రి మమ్ముట్టి ఇలా దృఢంగా ఉండటాన్ని ఆయన కుమారుడు, హీరో దుల్కర్ సల్మాన్ ప్రశంసించారు. లాక్డౌన్లో ఆయన తనకు తాను ఛాలెంజ్ విసురుకున్నారని తెలిపారు. దుల్కర్ ఆగస్టులో విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ‘మా నాన్న గత 150 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారు. కనీసం కారు తీసుకుని కాసేపు డ్రైవింగ్కు వెళ్లమన్నా.. వినలేదు. నాకు మాత్రం ఇంట్లో ఉండి బోర్ కొట్టేసింది. అవకాశం దొరికినప్పుడల్లా బయటికి వచ్చేసేవాడిని..’ అని చెప్పారు.
లాక్డౌన్ కాలంలో ముమ్ముట్టి తన వ్యాపకాల్లో నిమగ్నం అయ్యారు. రోజూ కసరత్తులు చేస్తూ ఫిట్గా మారారు. ఇంట్లో కూర్చునే ఆవరణలోని ప్రకృతిని, పక్షుల్ని కెమెరాలో బంధించారు. తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీతో సమయం గడిపే అవకాశం వచ్చిందంటూ ఫొటోలు కూడా షేర్ చేశారు. అంతేకాదు తన గార్డెన్లో మొక్కలు నాటి, వ్యవసాయం చేసినట్లు కూడా చెప్పారు.
ఇవీ చదవండి..
తెలుగమ్మాయిలపైనే ఆ ముద్ర ఎందుకు?
రాత్రికి రాత్రే స్టార్డమ్ వెనుక ఆరేళ్ల కష్టం..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
బాలీవుడ్ నటి కరీనాకపూర్ (Kareena Kapoor) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తానొక హిట్ ప్రాజెక్ట్ వదులుకున్నానని.. దాంతో ఆ అవకాశం దీపికను వరించిందని తెలిపారు. -
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
విజయ్ ఆంటోనీ (Vijay Antony) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘రోమియో’ (Romeo). ఇదే చిత్రాన్ని తెలుగులో ‘లవ్గురు’గా విడుదల చేశారు. -
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
నటి, గాయని స్మిత (Smita) నివాసంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM