‘ఢీ’ కంటే బెటర్‌ ఏముంది: మంచు విష్ణు

‘ఢీ’.. మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం. విష్ణు, జెనీలియా, శ్రీహరిల నటనతోపాటు బ్రహ్మానందం, సునీల్‌ కామెడీ టైమింగ్‌ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2007లో వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను...

Published : 20 Nov 2020 13:04 IST

హైదరాబాద్‌: ‘ఢీ’.. మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం. విష్ణు, జెనీలియా, శ్రీహరి నటనతోపాటు బ్రహ్మానందం, సునీల్‌ కామెడీ టైమింగ్‌ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2007లో వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే త్వరలో ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్‌ రానున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంచువిష్ణు చేసిన ఓ ట్వీట్‌తో ‘ఢీ’ సీక్వెల్‌ గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

‘‘కొన్ని వేలమంది సినీప్రియుల అభిమాన చిత్రం ‘ఢీ’. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క నటీనటుడికి ఇది ఒక గేమ్‌ఛేంజర్‌. ఆ రోజుల్లో సినిమాకి సంబంధించిన ఓ సరికొత్త ఒరవడికి ‘ఢీ’ శ్రీకారం చుట్టింది. ‘ఢీ’ కంటే బెటర్‌ ఏమి ఉంటుంది?’’ అని విష్ణు పేర్కొన్నారు. అంతేకాకుండా నవంబర్‌ 23న ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వివరించారు. దీంతో నెటిజన్లు ‘ఢీ’ సీక్వెల్‌ గురించే విష్ణు ప్రకటించనున్నారని చెప్పుకొంటున్నారు.

ప్రస్తుతం ‘మోసగాళ్లు’ చిత్రంలో మంచువిష్ణు నటిస్తున్నారు. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్‌, సునీల్‌శెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని