కీర్తిసురేశ్తో జగపతిబాబుకి ఉన్న వైరమేంటి?
‘‘మిస్ ఇండియా’ అంటే నేను కాదు. ఒక బ్రాండ్’ అని అంటున్నారు నటి కీర్తి సురేశ్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, నధియా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. త్వరలో ఈ చిత్రం నెట్ఫ్లిక్స్....
‘మిస్ ఇండియా’ అంటే ఒక బ్రాండ్ అంటోన్న నటి
హైదరాబాద్: ‘‘మిస్ ఇండియా’ అంటే నేను కాదు. ఒక బ్రాండ్’ అని అంటున్నారు నటి కీర్తి సురేశ్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు, నధియా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. త్వరలో ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. దసరా పండుగ సందర్భంగా తాజాగా ‘మిస్ ఇండియా’ ట్రైలర్ను చిత్రబృందం విడుదల చేసింది.
మధ్య తరగతి కుటుంబానికి చెందిన కీర్తి.. విదేశాలకు వెళ్లి వ్యాపారం చేయాలనే తన కలను ఎలా సాకారం చేసుకోగలిగింది, ఈ క్రమంలో సమస్యలను ఎలా అధిగమించింది.. అనే విషయాలను తెలియజేసేలా ‘మిస్ ఇండియా’ తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో కీర్తి తల్లిగా నదియా నటించారు. ట్రైలర్ ప్రారంభంలో కీర్తిని ఉద్దేశిస్తూ.. ‘నువ్వు నిజానికి చాలా దూరంగా.. అబద్ధానికి చాలా దగ్గరగా బతుకుతున్నావ్. నువ్వు, అన్నయ్యా జాబ్ చేస్తే తప్పా మన ఇల్లు సరిగ్గా గడవదు. అలాంటిది నువ్వు బిజినెస్ చేయడం..’ అంటూ నదియా చెప్పిన డైలాగ్ మధ్య తరగతి జీవిత కష్టాలను తెలియజేసేలా ఉంది.
కాగా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ‘మిస్ ఇండియా’ పేరుతో విదేశాల్లో ఇండియన్ టీ బిజినెస్ను ప్రారంభించిన కీర్తి సురేశ్కు తన ప్రత్యర్థి కంపెనీ కేఎస్కే యజమాని జగపతిబాబుతో వైరం ఏర్పడుతుంది. వ్యాపారం విషయంలో వారిద్దరి మధ్య ఉన్న పోటీని తెలియజేసే విధంగా ట్రైలర్లో చూపించిన పలు సన్నివేశాలు.. డైలాగ్లు ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు