450 మిలియన్‌ డాలర్ల స్కామ్‌..!

450 మిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడిన వాళ్లను కనిపెట్టి త్వరలోనే పట్టుకుంటామని.. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగంతో ప్రారంభమైన ‘మోసగాళ్లు’ టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో...

Updated : 07 Dec 2022 19:03 IST

ఆసక్తికరంగా ‘మోసగాళ్లు’ టీజర్‌

హైదరాబాద్‌: 450 మిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడిన వాళ్లను కనిపెట్టి త్వరలోనే పట్టుకుంటామని.. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రసంగంతో ప్రారంభమైన ‘మోసగాళ్లు’ టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను శనివారం అల్లు అర్జున్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో విష్ణు, కాజల్‌ మోసగాళ్లుగా కనిపించనున్నట్లు సమాచారం. టీజర్‌లోని ఓ సన్నివేశంలో డబ్బు కట్టలు చూపిస్తూ.. ఇది సరిపోతుందిగా అని కాజల్‌ అడగగా... ‘ఆట ఇప్పుడే మొదలైంది’ అంటూ విష్ణు చెప్పే డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది.

జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని పాన్‌ ఇండియన్‌ మూవీగా రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అలాగే నవదీప్‌ సైతం ఓ కీలక పాత్రలో నటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని