సాగర తీరాన రష్మిక కసరత్తులు
అందం, అభినయంతో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయిక రష్మిక. సాధారణం సెలబ్రిటీలు జిమ్, ఇళ్లలో కసరత్తులు చేస్తుంటారు. లేకపోతే పచ్చని చెట్ల మధ్య వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. నటి రష్మిక సముద్రం ఒడ్డుకు జిమ్ పరికరాలు ఎత్తుకెళ్లి.. అక్కడ వర్కౌట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోల్ని
కష్టంగా ఉన్నా.. ఇష్టంగా మారిందట..
హైదరాబాద్: అందం, అభినయంతో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కథానాయిక రష్మిక. సాధారణంగా సెలబ్రిటీలు జిమ్, ఇళ్లలో కసరత్తులు చేస్తుంటారు. లేకపోతే పచ్చని చెట్ల మధ్య వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. నటి రష్మిక సముద్రం ఒడ్డుకు జిమ్ పరికరాలు ఎత్తుకెళ్లి.. అక్కడ వర్కౌట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోల్ని ఆమె అభిమానులతో పంచుకుంటూ.. అనుభూతిని తెలిపారు. ‘నా మొదటి బీచ్ వర్కౌట్.. నిజంగా చెబుతున్నా చాలా అలసిపోయా, కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడు సముద్రం ఒడ్డున వ్యాయామం చేయడానికి అలవాటు పడిపోయా. అలల శబ్దం.. సముద్రం సువాసన.. సూర్యోదయాన్ని చూడటం.. నా కాళ్ల కింద ఇసుక.. ఇదంతా చాలా అందంగా ఉంటుంది..’ అని రష్మిక అన్నారు. ఫాలోవర్స్ కోరిక మేరకు వీడియోను షేర్ చేసినట్లు పేర్కొన్నారు.
రష్మిక ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇస్తుంటారు. తన మనసు బాలేనప్పుడు ఎక్కువగా కసరత్తులు చేస్తుంటానని ఓ సందర్భంలో అన్నారు. లాక్డౌన్ కారణంగా ఆమె గత కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే షూటింగ్ల కోసం ప్రయాణాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆమె రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం చేసి.. వీడియో షేర్ చేశారు. రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహేశ్బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా హిట్ అందుకుంది. రష్మిక ప్రస్తుతం ‘పుష్ప’లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం దొంగతనం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇందులోని పాత్రల కోసం బన్నీ, రష్మిక చిత్తూరు యాస నేర్చుకుంటున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..