NBK107: పేరు ఖరారు కాలేదు

బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ చిత్రం రూపొందనుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తారు. బాలకృష్ణ 107వ చిత్రమిది. ఆయన ప్రస్తుతం చేస్తున్న

Updated : 16 Sep 2021 12:47 IST

బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ చిత్రం రూపొందనుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తారు. బాలకృష్ణ 107వ చిత్రమిది. ఆయన ప్రస్తుతం చేస్తున్న ‘అఖండ’ తర్వాత పట్టాలెక్కనుంది. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కనున్న ఈ సినిమాకి పేరు ఖరారైందని సామాజిక అనుసంధాన వేదికల్లో ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్రబృందం స్పందించింది. ‘‘పేరు ఖరారు చేశామనేది అవాస్తవం. సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి, వాళ్ల ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది. సినిమా పేరు, ఇతర విషయాల్ని తగిన సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని