Naga Chaitanya: ఇద్దరు భామలతో

కథానాయకుడు నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో ఓ  వెబ్‌సిరీస్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘మనం’, ‘థ్యాంక్‌ యూ’ వంటి విజయవంతమైన చిత్రాల...

Updated : 10 Mar 2022 11:38 IST

థానాయకుడు నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో ఓ  వెబ్‌సిరీస్‌ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘మనం’, ‘థ్యాంక్‌ యూ’ వంటి చిత్రాల తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందుతోన్న మూడో ప్రాజెక్ట్‌ ఇది. విభిన్నమైన హారర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్‌.. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో చైతన్య  సరసన ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు. దీంట్లో ఓ నాయికగా కోలీవుడ్‌ భామ ప్రియా భవానిశంకర్‌, మరో పాత్రలో మలయాళీ నటి పార్వతి తిరువోతు నటిస్తున్నారు. ఈ ఇద్దరూ ఇప్పటికే సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను నటి ప్రియా తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఈ సిరీస్‌లో నాగచైతన్య ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. దీనికోసం ‘దూత’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌ త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని