నమ్రత ఫామ్‌.. మహేష్‌బాబు అభిమానుల ఫిదా!

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ తను పెంచుతున్న కూరగాయల తోట వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అందుకు మహేష్‌బాబు అభిమానులు ఫిదా అవుతున్నారు. రోజూ చేసే ప్రతి పనిని ఆమె తన అభిమానులతో షేర్‌ చేస్తుంటారు.

Published : 17 Dec 2020 01:16 IST

హైదరాబాద్‌: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ తను పెంచుతున్న కూరగాయల తోట వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అందుకు మహేష్‌బాబు అభిమానులు ఫిదా అవుతున్నారు.  తన వెజ్జీ ఫామ్ టూర్‌ వీడియోను షేర్‌ చేశారు. ఫామ్‌లో వరి, టమాటా, మిరపకాయలు, పత్తిని ఆమె పండిస్తున్నారు. నిత్యావసర వినియోగం కోసం ఈ విధంగా తన సొంత పంటను పండించటం ఆమెకు ఎంతో ఇష్టమని రాసుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె చేసే కృషికి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే ముంబయిలో హాలీడేస్‌ పూర్తి చేసుకొని హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని