Tollywood: కుదిరితే జంట.. కనులకే పంట
హీరోకి తగిన జోడీ.. కథలోని పాత్రకి తగిన కథానాయిక... నిర్మాతల మార్కెట్ లెక్కలకి తగ్గ హీరోయిన్... సినిమా షూటింగ్ జరిగే సమయానికి డేట్లు సర్దుబాటు చేసే నాయిక... ఇలా ఓ సినిమాకి కథానాయికని ఎంపిక చేయడం వెనక చాలా తతంగమే ఉంటుంది.
హీరోకి తగిన జోడీ.. కథలోని పాత్రకి తగిన కథానాయిక... నిర్మాతల మార్కెట్ లెక్కలకి తగ్గ హీరోయిన్... సినిమా షూటింగ్ జరిగే సమయానికి డేట్లు సర్దుబాటు చేసే నాయిక... ఇలా ఓ సినిమాకి కథానాయికని ఎంపిక చేయడం వెనక చాలా తతంగమే ఉంటుంది. అన్నీ కుదిరితేనే అనుకున్న జంట తెరపై మెరిసేది. కథ తర్వాత సింహభాగం కసరత్తులు జోడీ ఎంపికకి సంబంధించే జరుగుతుంటాయి. కొన్ని బృందాలు చాలా రోజులుగా వీరి ఎంపికపై దృష్టిపెట్టాయి. ఆ క్రమంలో పలు జోడీలు దాదాపుగా ఖరారైనట్టే అనే సంకేతాలు పరిశ్రమ నుంచి వస్తున్నాయి.
తెలుగులో ఈ మధ్య అనూహ్యంగా కొన్ని కలయికలు సెట్ అయ్యాయి. విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కలయిక మినహా మిగతా వాటి గురించి పరిశ్రమలో పెద్దగా ప్రచారం జరగలేదు. కథ పక్కా కావడం, ఆ వెంటనే పచ్చజెండా ఊపడం, పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు ఊపందుకోవడం... ఇలా చకచకా జరిగిపోతున్నాయి. ఆ క్రమంలోనే కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగానే కొన్ని కొత్త జంటలు తెరపైకి వస్తున్నాయి.
* విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కలయికలో సినిమా చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నదే. ‘లైగర్’ తర్వాత వెంటనే మరోసారి పూరితో కలిసి విజయ్ దేవరకొండ సినిమా చేసే అవకాశాలు కనిపించాయి. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కలయికలో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇందులో నాయికగా కియారా
అడ్వాణీని ఎంపిక చేసేందుకు చిత్రబృందం ఆమెని సంప్రదించింది. డేట్లు సర్దుబాటు కాలేదు. దాంతో సమంతని ఖాయం చేసినట్టు సమాచారం. అలా విజయ్ - సమంత జోడీ ‘మహానటి’ తర్వాత మరోసారి ఖాయమైంది.
* కృతిశెట్టి జోరుమీద ఉంది. పట్టాలెక్కే యువ కథానాయకుల కొత్త ప్రాజెక్టులన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. శర్వానంద్ కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం, పవన్కల్యాణ్ - సాయి తేజ్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ‘వినోదాయ చిత్తం’ సినిమా కోసం కృతిశెట్టినే సంప్రదించారని, ఆమె దాదాపుగా ఖాయమైనట్టేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
* ఇటీవల ప్రచారంలోకొచ్చిన మరో జోడీ రామ్ పోతినేని - రష్మిక మందన్న. రామ్ పోతినేని కథా నాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీనికోసం రష్మిక మందన్న పేరు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఆమెతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతోంది.
* పరిశ్రమలో ప్రచారంలో ఉంటూ, ప్రేక్షకులను ఊరిస్తున్న మరో జోడీ నితిన్ - శ్రీలీల. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా శ్రీలీల దాదాపుగా ఖాయమైనట్టు అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
* ప్రచారంలో ఉన్న ఆ జోడీలు కుదిరాయంటే మాత్రం తెరపై కనులపండువ ఖాయం. కొత్త ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకోవడంలో నయా భామలు కృతిశెట్టి, శ్రీలీల జోరు ప్రదర్శిస్తున్నారు.
* చిరంజీవి కథా నాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలోనూ రవితేజ - నివేథా పేతురాజ్ జోడీ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ - మారుతి కలయికలో సినిమాకి సంబందించీ మాళవిక మోహనన్, శ్రీలీల, కృతిశెట్టి తదితర భామల పేర్లు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘టిల్లు 3’ని త్వరలోనే ప్రకటిస్తాం
‘‘ప్రేక్షకులు టిల్లు పాత్ర అనగానే హాస్యాన్నే ఆశిస్తారు. అందుకే హాస్యం ప్రధానంగానే స్క్రిప్ట్ రాశా. -
ప్రతినిధి పిలుపు
‘‘ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఒళ్లు విరిచి బయటకొచ్చి ఓటేయండి...’’ అంటూ ఓటర్లకు పిలుపునిచ్చాడు బాధ్యత కలిగిన ఓ జర్నలిస్ట్. -
బాక్సింగ్ శిక్షణలో మీనాక్షి
తెలుగు, తమిళ భాషల్లో వరుసగా అగ్ర తారలతో జోడీ కడుతూ జోరు చూపిస్తోంది మీనాక్షి చౌదరి. -
ఎందరికో అది ఓ కల.. వాళ్లలో నేనూ ఉన్నా
దక్షిణాదితోపాటు.. బాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ తన నటనతో సినీప్రియుల్ని మెప్పిస్తుంది కథానాయిక రాశీ ఖన్నా. -
అలియా స్పై ప్రపంచంలోకి బాబీ దేవోల్?
పాత్ర ఏదైనా అలవోకగా నటించగల సత్తా ఉన్న నటి అలియా భట్. -
‘విష్వక్..’ పేర్లు వినిపించాడు
విష్వక్ సేన్ కథానాయకుడిగా రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. -
ట్రాఫిక్లో చిక్కుకొని పాట పాడాను
‘నేను ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు ‘అమర్ సింగ్ చమ్కీలా’ చిత్రం కోసం సింగింగ్ ఆడిషన్ ఇవ్వాల్సి వచ్చింది’ అని అంటోంది పరిణీతి చోప్రా. -
రూహ్ బాబా మ్యాజిక్కే వేరు!
‘యానిమల్’ చిత్రంతో సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ భామ త్రిప్తి దిమ్రి. -
మనందరి కథతో... ‘శ్రీరంగనీతులు’
మూడు కథలు... నలుగురి జీవితాలు...ఎవరి ప్రయాణం ఎలా సాగింది? ఏ కథ ఎలాంటి మలుపు తీసుకుందో తెలియాలంటే ‘శ్రీరంగనీతులు’ చూడాల్సిందే. -
‘జీ2’ సెట్స్లోకి బనితా సంధు
అడివి శేష్ కథానాయకుడిగా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘జీ2’. ‘ -
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
15 ఏళ్ల క్రితం అలా వెళ్లాం.. ఇప్పుడు గర్వంగా ఉందంటూ అల్లు శిరీష్ పోస్ట్
15 ఏళ్ల క్రితం టూరిస్ట్లుగా వెళ్లినచోటే అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఉండడం ఎంతో ఆనందంగా ఉందని అల్లు శిరీష్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సముద్రంలో మరో ఆపరేషన్.. 23 మంది పాక్ పౌరులను రక్షించిన ఇండియన్ నేవీ
-
ముఖ్తార్ అన్సారీ చావుతో న్యాయం జరిగింది: అల్కా రాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/03/2024)
-
మరో పడవ హైజాక్.. రంగంలోకి భారత నేవీ
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
కేంద్ర మంత్రికి కృతజ్ఞతతో..! నామినేషన్ రుసుం చెల్లించిన విద్యార్థులు