ఓటీటీ బాటపట్టిన రాజ్‌తరుణ్‌..!

లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడడంతో సినీ పరిశ్రమ చాలావరకూ ఓటీటీ బాటపట్టింది. ఇప్పటికే కీర్తి సురేశ్‌ ‘పెంగ్విన్‌’, సుధీర్‌బాబు, నాని ప్రధాన పాత్రల్లో నటించిన ‘వి’తోపాటు పలు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌ సైతం ఓటీటీ...

Published : 11 Sep 2020 17:36 IST

అక్టోబర్‌ 2న ‘ఆహా’లో..

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడడంతో సినీ పరిశ్రమ చాలావరకూ ఓటీటీ బాటపట్టింది. ఇప్పటికే కీర్తి సురేశ్‌ ‘పెంగ్విన్‌’, సుధీర్‌బాబు, నాని ప్రధాన పాత్రల్లో నటించిన ‘వి’తోపాటు పలు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌ సైతం ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందించాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం సోషల్‌మీడియా వేదికగా రాజ్‌ తరుణ్‌ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘నిరీక్షణ దాదాపు పూర్తయ్యినట్లే. ఎందుకంటే 100శాతం వినోదాత్మకమైన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రాన్ని ఆహా వేదికగా మీ ముందుకు తీసుకురానున్నాం. అక్టోబర్‌ 2 విడుదల చేస్తున్నాం. ఫన్‌ మిస్‌ కాకండి’ అని ఆయన పేర్కొన్నారు.

విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహించిన ‘ఒరేయ్‌ బుజ్జిగా’ చిత్రానికి కేకే రాధామోహన్‌ నిర్మాతగా వ్యవహరించారు. రాజ్‌ తరుణ్‌కు జంటగా మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ నటించారు. ఇప్పటికే రాజ్‌ తరుణ్‌-హెబ్బా పటేల్‌ కలిసి ‘కుమారి 21ఎఫ్‌’, ‘ఈడోరకం ఆడోరకం’, ‘అంధగాడు’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని