ఆ రైల్వే స్టేషన్‌లో ఏం జరిగింది?

దర్శకుడు సంపత్‌ నంది అందిస్తున్న కథతో ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. వశిష్ట సింహ, హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత పొన్నాడ

Published : 11 Sep 2020 13:12 IST

హైదరాబాద్‌: దర్శకుడు సంపత్‌ నంది అందిస్తున్న కథతో ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. వశిష్ట సింహ, హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత పొన్నాడ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు అశోక్‌ తేజ్‌ తెరకెక్కిస్తున్నారు. కె.కె.రాధా మోహన్‌ నిర్మాత. ఈ చిత్రం తాజాగా చిత్రీకరణ ప్రారంభించుకుంది.

‘‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో చిత్రం రూపొందుతోంది. మేకప్, డ్రీమ్‌ సీక్వెన్సెస్, పాటలు వంటివేం లేకుండా సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కించనున్నారు. ఇందులో హెబ్బా పల్లెటూరి అమ్మాయిగా ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తోంద’’ని చిత్ర బృందం తెలియజేసింది. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని