అలవైకుంఠపురం జోడీ రిపీట్స్‌!

అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంగా చిత్రం కొనసాగుతుందని టాలీవుడ్‌ వినికిడి. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి, మాధవన్‌తో సహా అనేక మంది తమిళ నటులు నటిస్తారని వార్తలు వచ్చినా చిత్ర బృందం అధికారికంగా ఎవరి పేరును వెల్లడించలేదు

Published : 21 Oct 2020 16:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం రాబోతోంది. విజయ్‌సేతుపతి, మాధవన్ సహా అనేక మంది తమిళ నటులు నటిస్తారని వార్తలు వచ్చినా చిత్ర బృందం అధికారికంగా ఎవరి పేరునూ వెల్లడించలేదు. తాజాగా మరో తమిళ నటుడి పేరు సైతం వెలుగులోకి వచ్చింది.

విలక్షణ దర్శకుడు, నటుడు అయినా సముద్రఖని ఈ చిత్రంలో నటిస్తారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే పుష్ప బృందం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇప్పటికే సముద్రఖని, అల్లుఅర్జున్ కలిసి ‘అల వైకుంఠపురం’లో పనిచేశారు. ఈ చిత్రం అనంతరం తెలుగులో ఆయనకు అవకాశాలు వరుస కట్టాయి. దీంతో విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఆచితూచి అడుగేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘క్రాక్’‌, ‘ఆకాశవాణి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. గతంలో ‘శంభో శివ శంభో’, ‘జెండాపై కపిరాజు’ సహా అనేక తమిళ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ‘రఘువరన్‌ బీటెక్’‌లో ధనుష్కు తండ్రి పాత్రలో, ‘అలవైకుంఠపురం’లో అప్పలనాయుడి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని