హీరో మీదకి చెప్పు విసిరారు: మయూరి
ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ సుధాచంద్రన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సూపర్హిట్ చిత్రం ‘మయూరి’. సుధాచంద్రనే కథానాయికగా నటుడు సుభాకర్ కీలకపాత్రను పోషించిన ఈ సినిమా 1985లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత సుధాచంద్రన్...
మొట్టమొదటి బయోపిక్ తెరకెక్కించిన వ్యక్తి రామోజీరావుగారు
హైదరాబాద్: ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ సుధాచంద్రన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సూపర్హిట్ చిత్రం ‘మయూరి’. సుధాచంద్రనే కథానాయికగా నటుడు శుభాకర్ కీలకపాత్రను పోషించిన ఈ సినిమా 1985లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత సుధాచంద్రన్ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత కూడా ఆమెను ‘మయూరి’గానే ప్రేక్షకులు గుర్తుపడుతున్నారంటే ఆ సినిమా తెలుగువారికి ఎంతలా నచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ధారావాహికలు, షోలతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న సుధాచంద్రన్ తాజాగా.. ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఆమె తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు.
‘‘నేను ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ చేస్తే చూడాలని మా అమ్మ భావించింది. కానీ, అనుకోకుండా నటిగా వెండితెరకు పరిచయమయ్యాను. ఇప్పుడు మనం ఎన్నో బయోపిక్ల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ, 1985లోనే మొట్టమొదటి బయోపిక్ చేసిన నిర్మాత రామోజీరావుగారు. అదే ‘మయూరి’. ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు మా కుటుంబమంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్డే, ఫస్ట్ షాట్.. కన్నీళ్లు వచ్చేశాయి’’
‘‘మయూరి’ సినిమా తర్వాత దక్షిణాదితోపాటు బాలీవుడ్, భోజ్పురి చిత్రాల్లో నేను నటించాను. కానీ, దాదాపు 30 సంవత్సరాల తర్వాత కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో నన్ను గుర్తుపట్టి.. ‘మీరు మయూరిగారు కదా’ అని అడుగుతున్నారు. సుధాచంద్రన్ కంటే మయూరిగానే నేను ప్రేక్షకులకు చేరువయ్యాను’’
‘‘నేనూ, శుభాకర్గారు(మయూరి హీరో) ఓసారి గుంటూరులో ఫంక్షన్కు వెళ్లాం. మేము స్టేజ్పై ఉన్న సమయంలో పబ్లిక్లో నుంచి ఓ వ్యక్తి శుభాకర్పైకి చెప్పు విసిరాడు. ‘మీరే కదా.. మయూరిని బాధపెట్టిన ఆ హీరో’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నేను శుభాకర్. సినిమాలో మాత్రమే ఆ పాత్ర పోషించాను. నిజ జీవితంలో ఆ వ్యక్తిని నేను కాదు’ అని శుభాకర్ చెప్పాడు. కానీ, ప్రేక్షకులు మాత్రం నమ్మలేదు. ఎందుకంటే వాళ్లు అంతలా సినిమాని ఇష్టపడ్డారు’’
‘‘నాకు 13 ఏళ్లున్నప్పుడు మాకు యాక్సిడెంట్ అయ్యింది. ఆ ప్రమాదంలో తక్కువగా గాయపడింది నేను. పోలీసు అధికారులు వచ్చి.. ‘అమ్మ చనిపోయారు. మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకోండి’ అని చెప్పారు. ఆ సమయంలో ఆమె ఊపిరి పీల్చుకోవడం నేను గమనించాను’’ అని ఆనాటి ఘటనలను గుర్తు చేసుకుని సుధాచంద్రన్ భావోద్వేగానికి లోనయ్యారు. యాక్సిడెంట్ తర్వాత సుధాచంద్రన్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలేంటి? తన తల్లి మరణం గురించి ఆమె చెప్పిన చేదు నిజాలేంటి? తన జీవిత భాగస్వామి ఆమె ఎలా కలుసుకున్నారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలంటే డిసెంబర్ 28న ప్రసారం కానున్న ‘ఆలీతో సరదాగా’ చూడాల్సిందే. ఆ ఎపిసోడ్కు సంబంధించిన తాజా ప్రోమో మీకోసం..!
ఇదీ చదవండి
సమంత.. అనుష్క.. కీర్తి.. మెరిసిందెవరు?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
15 ఏళ్ల క్రితం అలా వెళ్లాం.. ఇప్పుడు గర్వంగా ఉందంటూ అల్లు శిరీష్ పోస్ట్
15 ఏళ్ల క్రితం టూరిస్ట్లుగా వెళ్లినచోటే అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఉండడం ఎంతో ఆనందంగా ఉందని అల్లు శిరీష్ పేర్కొన్నారు. -
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ హీరోతో నా తొలి సినిమా.. పగటి కలగానే మిగిలిపోయింది: కృతి సనన్
తన మొదటి సినిమా సల్మాన్తో నటించాలని కలలు కన్నట్లు కృతి సనన్ చెప్పారు. -
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకువచ్చింది. -
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు