లాక్డౌన్ తర్వాత మొదటి ప్రీరిలీజ్ ఈవెంట్..!
లాక్డౌన్ కారణంగా ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ లేక సినిమా ఇండస్ట్రీ బోసిపోయిందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే దాదాపు ఐదారు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ కూడా పట్టాలెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్ తరుణ్, మాళవికా నాయర్ జంటగా నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రీరిలీజ్ ఈవెంట్
సర్ప్రైజ్ ఇచ్చిన రాజ్ తరుణ్..!
హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఆడియో ఫంక్షన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ లేక సినిమా ఇండస్ట్రీ బోసిపోయింది. అయితే దాదాపు ఐదారు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ కూడా పట్టాలెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్ తరుణ్, మాళవికా నాయర్ జంటగా నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో వేడుకగా జరిగింది. లాక్డౌన్ తర్వాత జరిగిన మొట్టమొదటి ప్రీరిలీజ్ వేడుక ఇదే కావడం విశేషం. అతి తక్కువ మంది అతిథులతో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్కుమార్ కొండా మాట్లాడుతూ.. ‘కుటుంబం మొత్తాన్ని నవ్వించే ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కించాలని మూడేళ్ల క్రితమే అనుకున్నాను. ఆ విషయాన్ని నా స్నేహితుడు నంధ్యాల రవికి చెప్పాను. అలా మేము ‘ఒరేయ్ బుజ్జిగా’ కథ రాసుకున్నాం. రవినే ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు. అనంతరం మేము రాజ్తరుణ్ని కలిసి కథ చెప్పాం. తప్పకుండా సినిమా చేద్దాం అన్నాడు. నిర్మాత రాధామోహన్ కూడా మా కథకు ఓకే అన్నారు. అయితే హీరోయిన్ పాత్ర కోసం ఎవర్ని తీసుకోవాలి అని ఆలోచించాం. అలాంటి సమయంలో మాళవికా నాయర్ ఈ పాత్రకు చక్కగా సరిపోతారని అనిపించింది. అలాగే మరో హీరోయిన్ పాత్రకు హెబ్బాపటేల్ నప్పుతారని భావించి ఆమెను ఎంచుకున్నాం. చాలారోజుల తర్వాత ఇలాంటి ఈవెంట్లో అందర్నీ చూస్తుంటే నాకు పండగ వాతావరణంలా ఉంది. ఉగాది పండగ రోజున థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసి మీ నవ్వుల్ని చూడాలనుకున్నాం. కానీ అనుకోని పరిణామం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఇలా ఇప్పుడు ‘ఆహా’ వేదికగా విడుదల చేస్తున్నాం. తప్పకుండా అందరూ ‘ఆహా’ వేదికగా సినిమా చూసి నవ్వుకోవాలని ఆశిస్తున్నాను’ అని దర్శకుడు విజయ్కొండా కోరారు.
హీరోయిన్ మాళవికా నాయర్ మాట్లాడుతూ.. ‘చాలారోజుల తర్వాత స్టేజ్పై ఇలా మైక్ పట్టుకుని మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. ఫుల్టైమ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని మీకు అందించడానికి ఏడు నెలల నుంచి ఎదురుచూస్తున్నాం. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను’ అని తెలిపారు. మరో కథానాయిక హెబ్బాపటేల్ మాట్లాడుతూ.. ‘‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఏడు నెలల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవాల్సి వచ్చింది. ఎన్నో నెలల తర్వాత ఓ సినిమా ఫంక్షన్ కోసం రెడీ అవ్వడం హ్యాపీగా అనిపించింది. రాజ్తరుణ్తో కలిసి వర్క్ చేయడం నాకెప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మాళవికా నాయర్ చాలా తెలివైన నటి.’ అని పేర్కొన్నారు.
హీరో రాజ్తరుణ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్స్ జరుగుతాయని భావించలేదు. కానీ నేను నటించిన సినిమాకి ఇలాంటి ఈవెంట్ జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇలాంటి ఈవెంట్ను ఏర్పాటు చేసినందుకు ‘ఆహా’, నిర్మాత రాధామోహన్గారికి ధన్యవాదాలు. మొదటిగా నా టీం మొత్తానికి థ్యాంక్స్ చెబుతున్నాను. నటుడిగానే కాకుండా ఈ సినిమా స్ర్కిప్ట్లో కూడా భాగమైన మధు, నాతో స్టెప్పులు వేయించిన శేఖర్ మాస్టర్కి ధన్యవాదాలు. మాళవికను ఈ చిత్రంలో కొత్త కోణంలో చూస్తారు.’
ఒక్కరోజు ముందుగానే ‘ఒరేయ్ బుజ్జిగా’
‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని కొంచెం ముందుగా విడుదల చేయాలని తనకి ఎంతో మంది స్నేహితుల దగ్గర నుంచి మెస్సేజ్లు వస్తున్నాయని.. ‘ఆహా’, నిర్మాత రాధామోహన్ దానికి అంగీకరించాలని హీరో రాజ్ తరుణ్ కోరారు. దీంతో ప్రేక్షకుల కోరిక మేరకు ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని ఒక్కరోజు ముందుగా.. అక్టోబర్ 1వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!