నాన్న ఇప్పటికీ టీ స్టాల్ నడుపుతున్నాడు!
తన తండ్రి ఇప్పటికీ టీ కొట్టు పెట్టుకుని, జీవనం సాగిస్తున్నాడని ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధర్మేశ్ యెలండే పేర్కొన్నారు. ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ సీజన్లో పాల్గొన్న తర్వాత ఆయన కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు .......
ప్యూన్గా పనిచేస్తూ.. పిల్లలకు డ్యాన్స్ పాఠాలు చెప్పా..
ముంబయి: తన తండ్రి ఇప్పటికీ టీ కొట్టు పెట్టుకుని, జీవనం సాగిస్తున్నాడని ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధర్మేశ్ యెలండే పేర్కొన్నారు. ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ సీజన్లో పాల్గొన్న తర్వాత ఆయన కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తొలి అవకాశం ఇచ్చారు. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘తీస్ మార్ ఖాన్’ చిత్రానికి కొరియోగ్రఫీ అందించే బాధ్యతలు అప్పగించారు. ఆపై ధర్మేశ్ డ్యాన్స్ ప్రధానాంశంగా రూపొందిన ‘ఏబీసీడీ’తో నటుడిగా పరిచయం అయ్యారు. ‘ఏబీసీడీ 2’, ‘బాంజో’, ‘స్ట్రీట్ డ్యాన్స్’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి, గుర్తింపు తెచ్చుకున్నారు.
ధర్మేశ్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి తాజాగా మీడియాతో పంచుకున్నారు. డ్యాన్స్ సాధన చేయడానికి ఇంట్లో స్థలం లేకపోవడం వల్ల వీధుల్లోకి వెళ్లేవాడినని చెప్పారు. ‘మున్సిపాలిటీ వాళ్లు మా నాన్న దుకాణాన్ని కూల్చేసినప్పుడు మా జీవితాలు తలకిందులయ్యాయి. నాన్న చిన్న టీ స్టాల్ పెట్టి, రోజుకు రూ.50 సంపాదించేవారు. ఆ డబ్బులతో ఇంట్లోని నలుగురిని పోషించడం కష్టంగా మారింది. మా పాఠశాల ఫీజు కోసం ప్రతి పైసా దాచేవాడు. ఆరో తరగతిలో నేను డ్యాన్స్ పోటీల్లో పాల్గొని, బహుమతి గెలుచుకున్నా. నా నైపుణ్యాన్ని చూసిన నాన్న ప్రోత్సహించారు. డ్యాన్స్ క్లాసుల్లో చేర్పించారు. నా 19 ఏళ్ల వయసులో కళాశాలకు వెళ్లడం మానేశా. ప్యూన్గా పనిచేస్తూ.. పిల్లలకు డ్యాన్స్ క్లాసులు చెప్పా. నెలకు రూ.1600 సంపాదించేవాడ్ని. నా పనుల్నీ అయ్యాక డ్యాన్స్ సాధన చేయడానికి పరుగులు తీసేవాడ్ని. కొన్నాళ్లకు ఉద్యోగం మానేసి.. పూర్తిగా డ్యాన్స్పై దృష్టి పెట్టా. ఈ క్రమంలో సినిమాల్లోని పాటల్లో నేపథ్య డ్యాన్సర్గా చేశా’ అని ఆయన చెప్పారు.
ఆపై బాలీవుడ్లో రాణించాలనే కలతో గుజరాత్ నుంచి ముంబయికి షిఫ్ట్ అయ్యారు. ఓ డ్యాన్స్ రియాల్టీ షో విజేతగా నిలిచి, తన తండ్రి రూ.5 లక్షల అప్పు తీర్చారు. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో చేతిలో ఉన్న డబ్బులు ఖాళీ అయ్యాయి. తిరిగి ఇంటికి చేరుకున్నట్లు ధర్మేశ్ తెలిపారు. ఆపై ఆయన ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’ షోతో పాపులర్ అయ్యారు. ‘ఏబీసీడీ’ సినిమాలో అవకాశం ఆయన జీవితాన్ని మార్చేసింది. ‘నేను సంపాదిస్తున్న డబ్బులతో నా కుటుంబం కోసం ఓ ఇల్లు కొన్నా. ఇప్పటికీ నాన్న అదే టీ స్టాల్ నడుపుతున్నారు. ఇకపై పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పా. కానీ నా మాటలు వినలేదు. బహుశా.. నాకు ఇంత పట్టుదల నాన్న నుంచే వచ్చిందేమో..’ అని ధర్మేశ్ పేర్కొన్నారు.
ఇవీ చదవండి..
తమన్నా హార్ట్ను బ్రేక్ చేసింది ఎవరు..?
ఏ దుస్తులు వేసుకున్నా ట్రోల్ చేస్తారు: అనన్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ