ఆ సన్నివేశాలను తొలగించాం : పరుచూరి
బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం ‘లారీ డ్రైవర్’. 1990లో విడుదలైన ఈ చిత్రం ఇటీవలే 30ఏళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను దర్శకులు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’లో పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం ‘లారీ డ్రైవర్’. 1990లో విడుదలైన ఈ చిత్రం ఇటీవలే 30ఏళ్లు పూర్తి చేసుకున్న సంద్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను దర్శకులు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’లో పంచుకున్నారు. ‘‘బాలయ్య బాబు ఎన్నో చిత్రాలకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఎప్పుడైనా ఆయనే కథ అడిగేవారు. రెండు కథలు చెప్పాం. ఒకటి ‘నిప్పురవ్వ’, మరొకటి ‘వంశానికొక్కడు’. కానీ, ఈ రెండు జరగలేదు. ‘లారీ డ్రైవర్’, ‘బొబ్బిలి సింహం’ చిత్రాలు వచ్చాయి. ఈ చిత్రం కంటే ముందు ‘వంశానికొక్కడు’ కథను గోపాల్కి చెప్పాను. అప్పుడాయన.. ‘కథ బాలేదు గురువుగారు’ అన్నారు. అది కాదు, బాబుకి కూడా ఒకసారి వినిపిస్తా అని అంటే ‘వద్దండి. ఇంకేదైనా విందాం. ప్లీజ్’ అని అన్నారు. ఇక ఆయన అలా చెప్పేసరికి నేను సరే అన్నాను. అదే సమయంలో ఆంజనేయ పుష్పానంద్ ‘లారీ డ్రైవర్’ కథ వినిపించటంతో ఈ చిత్రాన్ని తీశారు. ఆ తర్వాత 1996లో చాలా ఆలస్యంగా శరత్ దర్శకత్వంలో ‘వంశానికొక్కడు’ చిత్రం తెరకెక్కింది’’ అని ఆయన చెప్పారు.
‘‘నేను వేరే సినిమా షూటింగ్లో ఉన్నాను. వీళ్లందరు ఈ చిత్రం షూటింగ్ కోసం రైల్లో వెళుతున్నారు. ముందుగానే ఈ చిత్రంలో బాబు మోహన్ను పెట్టుకోవాలనుకున్నాం. కానీ, ఈ కథలో ఆయనది చాలా చిన్న పాత్ర. అప్పటికే ఆయన అద్భుతమైన కమెడియన్. ఈ విషయం గురించి రైల్లో చర్చ నడుస్తోంది. అప్పుడు బాబు మోహన్ ఫోన్ చేసి ‘సర్, నేను రావాలా? వద్దా? నా పాత్ర ఉందా?’ అని అడిగారు. దాంతో ముందు ఆయనను రమ్మని చెప్పి, అప్పటికప్పుడు వీరందరూ కలిసి కూర్చొని ఓ అద్భుతమైన పాత్రను బాబు మోహన్కు ఇచ్చారు. ఆయన నటించిన ఈ చిన్న పాత్రే ఎంత ముఖ్యం అయింది అంటే క్లైమాక్స్లో బాబు మోహన్ ఆ రహస్యం చెప్తే కానీ లారీ డ్రైవర్ గెలవడు. అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంది’’ అని ఆయన అన్నారు.
‘‘ఈ చిత్రం సమయంలో విచిత్రం ఏమిటంటే శారద చేసిన కొన్ని సన్నివేశాలు కామెడీగా ఉన్నాయి. ఈ చిత్రంలో శారద కలెక్టర్ పాత్రలో నటించారు. ఆమె పాత్ర కామెడీగా ఉండటంతో కలెక్టర్ హోదాలో ఉండి ఇలా కామెడీగా ఉండటం ఏంటి అని ఆ సన్నివేశాలన్నింటినీ తొలగించి మళ్లీ రీషూట్ చేశాం. ఆమె పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చాం. అలాగే ఓ సూపర్ హిట్ చిత్రాన్ని బాలయ్య బాబుకు, మాకు అందించారు’’ అని ఆయన ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి