బ్యాడ్మింటన్ ఆడలేననుకున్నా: కశ్యప్
ఆస్తమా ఉందని తెలిసిన తర్వాత తాను ఇకపై బ్యాడ్మింటన్ ఆడలేననుకున్నానని క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ అన్నారు. సమంత వ్యాఖ్యాతగా ‘ఆహా’లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ చాట్ షో ‘సామ్ జామ్’. ఇటీవల ప్రారంభమైన ఈ షోలో తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా, కశ్యప్ పాల్గొని...
హైదరాబాద్: ఆస్తమా ఉందని తెలిసిన తర్వాత తాను ఇకపై బ్యాడ్మింటన్ ఆడలేననుకున్నానని క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ అన్నారు. సమంత వ్యాఖ్యాతగా ‘ఆహా’లో ప్రసారమవుతున్న సెలబ్రిటీ చాట్ షో ‘సామ్ జామ్’. ఇటీవల ప్రారంభమైన ఈ షోలో తాజాగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా, కశ్యప్ పాల్గొని సందడి చేశారు. బ్యాడ్మింటన్ను కెరీర్గా ఎంచుకోవడం గురించి కశ్యప్ స్పందిస్తూ కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
‘‘నేను చదువులో బాగా చురుగ్గా ఉండేవాడిని. స్కూల్ చదువు పూర్తయ్యాక బ్యాడ్మింటన్నే కెరీర్గా ఎంచుకోవాలా? లేదా ఇంజినీరింగ్ చేయాలా?అని బాగా ఆలోచించాను. ఎంసెట్ ప్రవేశ పరీక్ష రాసి కౌన్సిలింగ్కు వెళ్లిన సమయంలో ఆటపైనే దృష్టి పెట్టాలనిపించింది. ‘అమ్మా.. చదువు, స్పోర్ట్స్ రెండింటిలోనూ ఒకేసారి ఫోకస్ చేయలేను. ఒక క్రీడాకారుడిగా నన్ను నేను నిరూపించుకోవడానికి సమయం ఇవ్వు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే అప్పుడు చదువుతాను’ అని అప్పుడు మా అమ్మతో చెప్పాను. నా మాట విని అమ్మ షాక్ అయ్యింది. తర్వాత ఓకే అని చెప్పింది. నాన్నకి కూడా అమ్మే నచ్చజెప్పింది. అలా బ్యాడ్మింటన్ను కెరీర్గా ఎంచుకుని ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాను. అదే సమయంలో నాకు ఆస్తమా ఉందని వైద్యులు చెప్పారు. ఇక కెరీర్ ముగిసిపోయిందని.. బ్యాడ్మింటన్ ఆడలేననుకున్నాను. కానీ, వైద్యులు చెప్పిన మందులు తీసుకుంటున్నాను. అది ఎప్పటికీ ఒక ఫైట్. ఇప్పుడు అంతా బాగానే ఉంది’’ అని కశ్యప్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..