‘ఆ నటి నా భార్య.. ఎవరికీ చెప్పొద్దంది’
బుల్లితెర నటి పవిత్ర పునియా తన భార్యని ఓ హోటల్ యజమాని సుమిత్ మహేశ్వరి అన్నారు. పవిత్ర ‘లవ్ యు జిందగీ’తో కెరీర్ ఆరంభించి అనేక పాపులర్ ధారావాహికలతో ఆకట్టుకున్నారు. తనకు నిశ్చితార్థమైందని, కానీ రద్దు చేసుకున్నానని నటి ఓసారి చెప్పారు. కాగా పవిత్రతో వివాహమైందని, దాన్ని ఆమె రహస్యంగా ఉంచారని సుమిత్ మీడియా...
పెళ్లైన విషయం చెప్పకుండా మరో నటుడ్ని ప్రేమించింది..
ముంబయి: బుల్లితెర నటి పవిత్ర పునియా తన భార్య అని ఓ హోటల్ యజమాని అయిన సుమిత్ మహేశ్వరి అన్నారు. పవిత్ర ‘లవ్ యు జిందగీ’తో కెరీర్ ఆరంభించి అనేక పాపులర్ ధారావాహికలతో ఆకట్టుకున్నారు. తనకు నిశ్చితార్థమైందని, కానీ... దాన్ని రద్దు చేసుకున్నానని నటి ఓసారి చెప్పారు. కాగా పవిత్రతో వివాహమైందని, దాన్ని ఆమె రహస్యంగా ఉంచారని సుమిత్ మీడియా ముందుకు వచ్చారు. ఆమె బుల్లితెర నటుడు పరాస్ ఛబ్రాను కూడా మోసం చేశారని తెలిపారు.
‘మేము ఇప్పటికీ భార్యాభర్తలమే. మా ఇద్దరికీ నిశ్చితార్థమైంది, పెళ్లి కూడా జరిగింది. కానీ పవిత్ర బయటికి చెప్పనివ్వలేదు. నా భార్యగా ఉంటూనే పరాస్ ఛబ్రాను ప్రేమించింది. వీరి ప్రేమ గురించి తెలిసిన తర్వాత నేను పరాస్కు మెసేజ్ చేశా. పవిత్రతో ప్రేమను కొనసాగించొచ్చని.. కానీ విడాకులు వచ్చేంత వరకు ఆగమని చెప్పాను. నా కుటుంబ సభ్యులు కూడా జోక్యం చేసుకున్నారు. ఇప్పటికీ నా చేతిపై పవిత్ర టాటూ ఉంది. ఆమె పూర్తిగా మారిపోయింది, నాలో ఎటువంటి మార్పు రాలేదు. తొలుత పరాస్తో ఆమె అతి చనువుగా ఉందని తెలుసుకుని షాకయ్యా. మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్న అదే గోవా హోటల్లో పవిత్ర, పరాస్ ఉన్నారని తెలుసుకుని ఎంతో బాధపడ్డా. నా భార్య వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఆమె ప్రేమలో నిజాయితీ లేదు’ అని సుమిత్ పేర్కొన్నారు.
పెళ్లైన మహిళ మరో పురుషుడిని ప్రేమించడం, మోసం చేయడం తప్పని బుల్లితెర నటుడు పరాస్ పవిత్రను ఉద్దేశిస్తూ కొన్ని రోజుల క్రితం అన్నారు. ‘ఆమె భర్త నాకు మెసేజ్ చేయడం వల్ల నిజం తెలుసుకున్నా. పవిత్రను ప్రశ్నిస్తే.. నిజమేనని చెప్పింది. ఆ తర్వాత ఆమె గురించి మరో షాకింగ్ విషయం తెలిసింది. ఇప్పుడు దాన్ని బయటపెట్టను’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత