ఇటలీలో ప్రభాస్‌ మేనియా

‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విదేశాల్లో సైతం ఆయనకి అభిమానులున్నారనే విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్‌ సినిమాల గురించి విదేశీ మీడియాలో సైతం వార్తలు వస్తుంటాయి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ సినిమాలో....

Updated : 30 Oct 2020 11:41 IST

హైదరాబాద్‌: ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విదేశాల్లో సైతం ఆయనకి అభిమానులున్నారనే విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్‌ సినిమాల గురించి విదేశీ మీడియాలో సైతం వార్తలు వస్తుంటాయి. ప్రస్తుతం ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ గతకొన్నిరోజులుగా ఇటలీలో జరుగుతోంది. చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ మేరకు ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ గురించి ఇటలీ మీడియా ప్రత్యేక కథనాల్ని ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ వింటేజ్‌ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్‌, పూజాహెగ్డే జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందిస్తున్నారు. అలనాటి తార భాగ్యశ్రీ,  సత్యరాజ్‌, జగపతిబాబు, జయరాం ఈ సినిమాలో కీలక సన్నివేశాలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈసినిమా మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని