Prabhas: మెరుపు వేగంతో..

మరో సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్దమయ్యారు ప్రభాస్‌. వచ్చే నెలలోనే ఆ చిత్రం ప్రారంభం కానున్నట్టు సమాచారం. కొన్ని నెలల వ్యవధిలోనే, మెరుపు వేగంతో ఆ సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు

Updated : 17 Mar 2022 08:14 IST

రో సినిమాని పట్టాలెక్కించేందుకు సిద్దమయ్యారు ప్రభాస్‌. వచ్చే నెలలోనే ఆ చిత్రం ప్రారంభం కానున్నట్టు సమాచారం. కొన్ని నెలల వ్యవధిలోనే, మెరుపు వేగంతో ఆ సినిమాని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే వ్యూహంతో ఆయన సన్నద్ధమైనట్టు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్‌’తో సందడి చేస్తున్న ప్రభాస్‌.. ఇటీవల మారుతి చెప్పిన మరో కథకి పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా భారీ చిత్రాలే చేస్తూ వచ్చారాయన. ఒప్పుకున్న సినిమాలు కూడా అలాంటివే. కానీ మారుతి దర్శకత్వంలో సినిమా మాత్రం భారీ హంగులతో కాకుండా..  ఆయన శైలి వినోదమే ప్రధానంగా రూపొందుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కథానాయికల ఎంపికపై దృష్టిపెట్టిన ఆ చిత్రబృందం... ఇప్పుడు ఓ భారీసెట్‌ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. హైదరాబాద్‌లోనే రూ.5 కోట్లకిపైగా వ్యయంతో ఓ ఇంటి సెట్‌ నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్‌ నటిస్తోంది. ఇందులో మరో ఇద్దరు కథానాయికలకి చోటున్నట్టు తెలిసింది. అన్నీ అనుకున్నట్టుగా సాగితే ఈ ఏడాదిలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని