అలా బతికిన ప్రతి మనిషి బాధపడతాడు: పూరి
అవినీతి ఎరుపు రంగులో ఉంటుందని అందుకే అది మన రక్తంలో కలిసిపోయిందని అంటున్నారు దర్శకుడు
ఇంటర్నెట్డెస్క్: అవినీతి ఎరుపు రంగులో ఉంటుందని అందుకే అది మన రక్తంలో కలిసిపోయిందని అంటున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్. ‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ‘కరప్షన్’ అనే అంశంపై మాట్లాడారు.
‘‘పదేళ్ల కొడుకుతో తల్లి.. ‘నాన్న బజారుకెళ్లి కూరగాయలు పట్టుకురా. అలాగే కిరాణా షాపునకు వెళ్లి ఈ సరకులు కూడా తీసుకురా’ అని అంటే, అప్పుడు కొడుకు ‘నాకు ఐస్క్రీమ్కి డబ్బులు ఇస్తే తీసుకొస్తా’ అంటాడు. ‘అలాగే నాన్న’ అంటుంది. మరోసారి ఇంకో పని చెబితే, ‘పానీ పూరికి డబ్బులిస్తేగానీ వెళ్లను’ అంటాడు. వాడిని చూసి మురిసిపోతూ ‘ఏంటో వీడికి ప్రతి దానికీ లంచమే’ అనుకుని ఆ తల్లి మురిసిపోతుంది. ఆ తర్వాత ఆ వెధవే ఏ ఆఫీసరో అవుతాడు. మనందరి సరదా తీర్చేస్తాడు. కన్నతల్లినే వదలని వాడు నిన్ను, నన్నూ ఎందుకు వదులుతాడు. ఇలా మారం చేసే పిల్లలతో ఈ ప్రపంచం నిండిపోయింది. పవర్ వల్ల ఎవడైనా లంచగొండి అవుతాడు. పవర్ ఉండటం తప్పు కాదు. ఆ పవర్ ఎవరి చేతుల్లో ఉన్నదనేదే పాయింట్. అందుకే చిన్నప్పుడు మారాం చేసిన పిల్లలందరూ పవర్ కోసం.. పవర్ఫుల్ పొజిషన్ కోసం ప్రయత్నిస్తారు. మెల్లగా అలాంటి జాబ్లో జాయిన్ అవుతారు. పెద్ద పెద్ద పోస్టులు అవసరం లేదు. చెక్పోస్ట్ దగ్గర స్టాంప్ వేసే పోస్ట్ దొరికితే చాలు. కుమ్మేస్తారు’’
‘‘ఎవరైనా రాజకీయ నాయకుడు అవినీతి చేసి, వేల కోట్లు నొక్కేశాడని తెలిస్తే , కోపంతో ఊగిపోతాం. అలా ఊగిపోయేవాడిని తీసుకెళ్లి అలాంటి పోస్టులో కూర్చోబెడితే వాడు అంతకంటే ఎక్కువ చేస్తాడు. భారతదేశంలో రాజకీయ నాయకుల కన్నా ప్రజలు బలవంతులు. ఓటు అడిగితే ఫుట్బాల్ ఆడుకుంటారు. ఇండియాలో పెట్టే ప్రతి సంతకం వెనుక అవినీతి ఉంది. వేసే ప్రతి ఓటు వెనుక లంచం ఉంది. అందుకే ప్రతి ఎన్నికలకు ఖర్చు రెట్టింపు అవుతోంది. పవర్లోకి రావాలన్నా, ఆ తర్వాత ఎన్నికల వరకూ బతికి ఉండాలన్నా డబ్బు కావాలి. ‘మీ తాత మినిస్టర్గా చేశాడంట కదా! ఒక్క ఆస్తీ సంపాదించలేదు’ అంటూ సొంత కుటుంబ సభ్యులు తిడతారు. నిజాయతీగా బతికిన ప్రతి మనిషి చనిపోయే ముందు బాధపడతాడు. ఎందుకంటే నా అనుకున్న వాళ్లు కూడా వాళ్లతో ఉండరు. అవినీతి రంగు ఎరుపు. అందుకే మన రక్తంలో కలిసిపోయింది’’
‘‘వంద ఇచ్చినోడు దాన్ని మొహాన కొట్టాననుకుంటాడు.. వంద తీసుకున్నోడు దాన్ని నొక్కేశాననుకుంటాడు. ఇద్దరి కళ్లలో ఒక మెరుపు, తెలియని ఆనందం. ‘స్వామి.. ఈ డీల్ ఎలాగో అయ్యేలా చూడు. నీకూ ఏదో ఒకటి ఇస్తాం’ అని భగవంతుడుని ప్రార్థిస్తూ, ప్రతి మొక్కులోనూ పర్సంటేజీలు లెక్కగడతాం. ఇది కాకుండా మనకు సంబంధంలేని వాటి గురించి కూడా ఏదో ఆశిస్తాం. కారు కొనుకుంటే, ఫ్రెండ్స్ అందరూ పార్టీ ఇవ్వమని గొడవచేస్తారు. ఎందుకంటే ఈర్ష్య. ఎవరినీ పిలవకుండా గృహప్రవేశం, పెళ్లి, కనీసం బర్త్డే పార్టీ చేసుకున్నా మిమ్మల్ని చంపేస్తారు. ఈ అవినీతిని తగ్గించేందుకు ఒక మార్గం ఉంది. మార్కెట్కు వెళ్లడానికి లంచం అడిగే మీ పిల్లల్ని, ఇప్పుడే.. ఈరోజే అదుపు చేయండి. లేదు. ఊళ్లో అందరి కంటే మీ పిల్లలే రిచ్గా, లావుగా బొద్దుగా ఉండాలని కోరుకుంటే పానీ పూరికి డబ్బులిచ్చి పంపండి. చెంగు చెంగున ఎగురుకుంటూ వెళ్లిపోతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?