ఐఏఎస్ కావాలని.. కాపీ రైటర్గా పనిచేసి..!
బాల్యంలో గాయని కావాలనుకుంది. వయసు పెరిగే కొద్దీ పుస్తకాల పరుగుగా మారింది. చదువులో టాపర్గా నిలిచింది. ఐఏఎస్ అధికారిణిగా మారి.. ప్రజలకు సేవలందించాలని కలకంది. మనమొకటి తలిస్తే విధి మరొకటి తలచినట్లు.. ఆమె కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. కాలం ఆమెను అందరూ మెచ్చే కథానాయికను....
రాశీ బర్త్డే స్పెషల్.. ఇవి మీకు తెలుసా?
బాల్యంలో గాయని కావాలనుకుంది. వయసు పెరిగే కొద్దీ పుస్తకాల పురుగ్గా మారింది. చదువులో టాపర్గా నిలిచింది. ఐఏఎస్ ఆఫీసర్గా మారి.. ప్రజలకు సేవలందించాలని కలకంది. తానొకటి తలిస్తే విధి మరొకటి తలచినట్లు.. ఆమె కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. కాలం ఆమెను అందరూ మెచ్చే కథానాయికను చేసింది. తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తోనే కుర్రకారు కలల రాణిగా మారిన రాశీ ఖన్నా గురించేనండీ ఇదంతా.. సోమవారం ఈ అందాల భామ జన్మదినం. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..
రాశీ ఖన్నా దిల్లీలో పుట్టి, పెరిగారు. అక్కడే పాఠశాల, కళాశాల చదువులు పూర్తి చేశారు. చిన్నతనంలో గాయని కావాలనుకున్నారట. కానీ పెద్దయ్యే కొద్దీ చదువుపై ఆసక్తి పెరిగి, ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కలకన్నట్లు ఓసారి చెప్పారు. చదువు పూర్తయ్యాక ప్రకటనలకు కాపీ రైటర్గా పనిచేశారు. ఆపై ఆమెకు ప్రకటనల్లో నటించే అవకాశం వచ్చింది.
ప్రకటనలతో గుర్తింపు పొందిన రాశీ ఖన్నాకు 2013లో హిందీ చిత్రం ‘మద్రాస్ కేఫ్’లో అవకాశం వచ్చింది. సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె జాన్ అబ్రహం భార్యగా పాత్రలో నటించారు. చిత్రం రూ.100 కోట్లు వసూలు చేయడంతో ఆమె ఆరంభం అదిరింది.
‘మద్రాస్ కేఫ్’లో రాశీ నటనకు ఇంప్రెస్ అయిన నటుడు శ్రీనివాస్ అవసరాల ‘ఊహలు గుసగుసలాడే’లో కథానాయిక పాత్ర కోసం సంప్రదించారు. ఈ క్రమంలో ‘మనం’ చిత్రంలో అతిథి పాత్ర (నాగచైతన్య ప్రేయసి) పోషించే అవకాశం కూడా వచ్చింది. దానికి కూడా రాశీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ కన్నా ముందే ‘మనం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె పూర్తిస్థాయిలో కథానాయికగా తెలుగువారికి పరిచయమైంది మాత్రం నాగశౌర్య చిత్రంతోనే. ఆపై వరుస సినిమాలతో బిజీగా గడిపారు. ‘జోరు’, ‘జిల్’, ‘శివమ్’, ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’, ‘హైపర్’, ‘జై లవకుశ’ చిత్రాలతో స్టార్ అయ్యారు.
2018లో రాశీ కోలీవుడ్కు కూడా పరిచయం అయ్యారు. అక్కడ కూడా వరుస సినిమాలతో నటిగా నిలదొక్కుకున్నారు. గత ఏడాది ‘అయోగ్య’, ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’తో మరికొన్ని హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆమె చేతిలో నాలుగు కోలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. సినిమాల్లోకి రావడానికి ముందు మోడలింగ్, యాక్టింగ్పై ఏ మాత్రం ఆసక్తిలేదని, నటి కావాలనే ఆలోచన ఏ రోజూ రాలేదని రాశీ అంటుంటారు.
నటిస్తూనే ఈ భామ గాయనిగానూ తన స్వరంతో అలరించారు. ‘జోరు’, ‘విలన్’, ‘బాలకృష్ణుడు’, ‘జవాన్’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాల కోసం పాటలు పాడారు. రాశీ గాత్రానికి కూడా అభిమానులు ఏర్పడ్డారు.
దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ వైఫల్యం ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇదే చేదు అనుభవాన్ని రాశీ కూడా ఎదుర్కొన్నారట. ‘నా జీవితంలో తొలి ప్రేమ తాలూకు అనుభవాలున్నాయి. స్కూల్లో చదివే రోజుల్లో పదిహేడేళ్ల వయసులో సీనియర్తో ప్రేమలో పడ్డాను. తొలుత అతడే నాకు ప్రోజ్ చేశాడు. ఏం చెప్పాలో పాలుపోలేదు. అంతవరకు నాకు ప్రేమంటే ఏంటో తెలియదు. కొన్ని సంఘటనల తర్వాత ఆ ప్రేమకథ విఫలమైంది’ అని ఓసారి ఆమె గుర్తు చేసుకున్నారు.
‘హైపర్’ (2016) వరకు రాశీ కాస్త బొద్దుగానే ఉండేవారు. కానీ ‘జై లవకుశ’లో (2017) స్లిమ్గా కనిపించి, సర్ప్రైజ్ చేశారు. ‘సినిమా కోసం, పాత్ర కోసం బరువు తగ్గలేదు. నా కోసం ఫిట్నెస్ను జీవనశైలిలో భాగం చేసుకున్నా. సన్నబడటం వల్ల నా కెరీర్ ఇంకా బలపడింది..’ అని ఓ ఇంటర్వ్యూలో రాశీ చెప్పారు.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్