‘వి’ మూవీ ఇలా చూసిన రాజమౌళి కుటుంబం

నాని, సుధీర్‌బాబు కీలకపాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘వి’. నివేదా థామస్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన

Published : 06 Sep 2020 01:06 IST

హైదరాబాద్‌: నాని, సుధీర్‌బాబు కీలకపాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన చిత్రం ‘వి’. నివేదా థామస్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నాని వైవిధ్యమైన నటన కనబరిచారు. తాజాగా ఈ చిత్రాన్ని రాజమౌళి కుటుంబం వీక్షించింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోను రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

‘‘వి’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో హంగామాను ఎంతో మిస్సవుతున్నాం. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే మేమంతా ఉదయం 8.45నిమిషాలకు ప్రసాద్స్‌లో ఈ సినిమా చూసేవాళ్లం. అయితే, ఇది కూడా ఆసక్తికరంగానే ఉంది.  వి చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని ట్వీట్‌ చేశారు. ఈ ఫొటోలు రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ హోం థియేటర్లో సినిమాను చూస్తూ ఆస్వాదించారు.

మరోవైపు ‘వి’ చిత్ర బృందం కూడా కలిసి ఈ సినిమాను చూసింది. నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్‌, అదితిరావు హైదరీ, ఇంద్రగంటి, దిల్‌రాజు కలిసి ఈ సినిమాను చూశారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని