వైరల్‌గా మారిన రకుల్‌ హాలీడే‌ ఫొటోలు

లాక్‌డౌన్‌, వరుస సినిమా షూటింగ్స్‌తో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన ఎంతోమంది సినీ తారలు షెడ్యూల్స్‌ నుంచి కొంత బ్రేక్‌ తీసుకుని హాలీడేను ఎంజాయ్‌ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు తారలు తమ కుటుంబసభ్యులు, ఇష్టమైన వారితో కలిసి గోవా...

Published : 21 Nov 2020 15:41 IST

బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న నటి

ఇంటర్నెట్‌డెస్క్‌: లాక్‌డౌన్‌తో కొంతకాలంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్‌ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు తారలు తమ కుటుంబసభ్యులు, ఇష్టమైన వారితో కలిసి గోవా, మాల్దీవులు, దుబాయ్‌ ప్రాంతాలకు టూర్‌ వెళ్తున్నారు. తాజాగా నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సైతం తన కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లారు.

టూర్‌లో భాగంగా సముద్రతీరంలో ఆమె సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఆమె సూర్యోదయం సమయంలో బీచ్‌లో యోగాసనాలు వేశారు. ‘‘సముద్రం వద్ద విటమిన్‌ ‘డీ’ని పొందడం కోసం ఇలా..’’ అని రకుల్‌ పేర్కొన్నారు. సముద్ర తీరంలో కూర్చొన్న మరో ఫొటోని షేర్‌ చేస్తూ.. ప్రతిక్షణం నవ్వుతూ సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించాలనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ప్రసుత్తం రకుల్‌ హాలీడే ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరి, రకుల్‌ టూర్‌కు సంబంధించిన పలు ఫొటోలు మీరూ చూసేయండి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని