‘పరాన్నజీవి’, ‘ఆర్జీవీ’లపై మీ స్పందనేంటి?
‘‘వివాదాస్పద కథాంశాలే ప్రేక్షకుల్ని త్వరగా ఆకర్షిస్తాయి. అందుకే ఆ తరహా సినిమాలు తీస్తుంటా’’ అన్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. కరోనా విస్తృతితో పోటీ పడుతూ...
‘‘వివాదాస్పద కథాంశాలే ప్రేక్షకుల్ని త్వరగా ఆకర్షిస్తాయి. అందుకే ఆ తరహా సినిమాలు తీస్తుంటా’’ అన్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. కరోనా విస్తృతితో పోటీ పడుతూ... వేగంగా సినిమాలు రూపొందించి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారాయన. ఇటీవలే ‘పవర్స్టార్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన ఇప్పుడు ‘థ్రిల్లర్’తో సిద్ధమయ్యారు. అప్సర రాణి ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్.కామ్’ ద్వారా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు వర్మ.
ఈ కరోనా పరిస్థితుల మధ్య వరుస చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించడం మీకెలా సాధ్యమవుతోంది?
ఆర్జీవీ: చిత్రీకరణలకు ఎన్ని అవరోధాలైనా ఉండొచ్చు. పరిస్థితుల్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా కథల్ని తయారు చేసుకోగలిగినప్పుడు, తగ్గ టెక్నీషియన్స్ దొరికినప్పుడు ఎన్ని చిత్రాలైనా చేసెయొచ్చు. దాన్నే నేనిలా చేతల్లో చూపిస్తున్నా. ప్రస్తుతం కరోనా తీవ్రత బాగా ఉంది కాబట్టి.. భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే చేస్తున్నాం.
ఏటీటీలో ‘పే ఫర్ వ్యూ’ పద్ధతి ద్వారా వసూళ్లు ఎలా ఉన్నాయి?
ఆర్జీవీ: మేం ఏం చేసినా అన్ని రకాలుగా కలిసొస్తున్నాయి. ఇలా వచ్చిన ‘పవర్స్టార్’ ఫలితంపై సంతృప్తిగా ఉన్నా. పరిస్థితులకు తగ్గట్లుగా మన ఆలోచనా విధానాల్ని మార్చుకోగలిగినప్పు ఏదైనా మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఇక్కడ నిడివి సమస్యలు లేవు. నేనెంచుకున్న కథల్ని దీనికి తగ్గ బడ్జెట్లోనే డిజైన్ చేసుకుంటున్నా.
‘థ్రిల్లర్’ చిత్రం ఎలా ఉండబోతుంది?
ఆర్జీవీ: శృంగారభరితంగా ఉండే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇలాంటి థ్రిల్లర్ జోనర్లో మరిన్ని సినిమాలొస్తాయి. ఈ చిత్రాన్ని ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’లో 11 భాషల్లో విడుదల చేస్తున్నాం.
ప్రస్తుతం ఓటీటీలో మీపై వస్తున్న ‘పరాన్నజీవి’, ‘ఆర్జీవీ’ తదితర చిత్రాలపై మీ స్పందనేంటి?
ఆర్జీవీ: నేనంతగా పట్టించుకోను. ప్రస్తుతం నా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా. పక్కవాళ్ల గురించి ఆలోచించే సమయం అసలు లేదు.
వర్మ చిత్రాలు ఇకపై ఏటీటీకే పరిమితమవుతాయా? లేక థియేటర్లోనూ చూడొచ్చా?
ఆర్జీవీ: ఇక్కడ నేను దేనికి పరిమితవుతా అన్నది సమస్య కాదు. థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయన్నది ముఖ్యం. ప్రస్తుతం నేను తీస్తున్న ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ సినిమాను థియేటర్లో చూపించాలనే ఎదురు చూస్తున్నా. కంటెంట్ విషయంలో థియేటర్లు, ఓటీటీ అని ప్రత్యేకంగా ఏం ఉండదు. కాకపోతే కొన్ని చిత్రాల్ని ఓటీటీలోకి తీసుకొస్తే అనుకున్న స్థాయిలో రాబడి రాదు. అందుకే పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూడక తప్పదు.
ఓటీటీకి సెన్సార్.. జరిగే పని కాదు
‘‘ఓటీటీ కంటెంట్ను సెన్సార్ పరిధిలోకి తీసుకురావాలని అందరూ అంటున్నారు. అది జరిగే పని కాదు. 1952లో ఈ సెన్సార్ యాక్ట్ను తీసుకొచ్చారు. ఇప్పుడు అనేక దేశాల నుంచి ఇన్ని ఓటీటీ వేదికలు వస్తున్నప్పుడు.. వాటిలో వచ్చే కంటెంట్ మొత్తాన్ని సెన్సార్ చేయడం అసాధ్యం. దీని కోసం ఎన్ని సెన్సార్ బోర్డు ఆఫీసుల్ని ఏర్పాటు చేస్తారు? ఎంత మంది సిబ్బందిని నియమిస్తారు? దీనికి తోడు త్వరితగతిన సెన్సార్ చేయడమన్నది అన్నింటి కన్నా పెద్ద సవాల్. గ్లోబల్గా అందరం ఒకటిగా కనెక్ట్ అయిపోయి ఉన్నప్పుడు ఐదారుగురు కూర్చోని.. ఎవరేం చూడొచ్చు, ఏం చూడకూడదు? అని ఎలా నిర్ణయిస్తారు.
మునుపటిలా కాదు
‘‘కరోనాకు వ్యాక్సిన్ వస్తోంది.. వచ్చింది’ అని కొద్దినెలలుగా వింటూనే ఉన్నాం. ఏదైనా నిజంగా ఆ వ్యాక్సిన్ ప్రజల చేతుల్లోకి వచ్చే దాకా ఏం చెప్పలేం. నా దృష్టిలో ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి చిత్ర పరిశ్రమ కుదటపడటానికి డిసెంబరు వరకు సమయం పట్టొచ్చు. ఒకవేళ ఇప్పట్లో థియేటర్లు తెరచుకున్నా.. ఒకప్పటి స్థాయిలో వందల కోట్ల రూపాయల వసూళ్లను తిరిగి చూడటం కష్టమే. ఎందుకంటే థియేటర్ల నిర్వహణ భారం పెరుగుతుంది. దీనికి తోడు ఓటీటీకి అలవాటు పడిన ప్రేక్షకులు ఎంత మేర థియేటర్లకు వస్తారన్నది ఇప్పుడే తెలియదు. ఫలితంగా బయ్యర్ల మార్కెట్లు పడిపోతాయి. నిర్మాతలు ఈ పరిస్థితులకు తగ్గట్లుగా తమ సినిమాల్ని తక్కువకు అమ్ముకోలేరు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మునుపటి స్థాయిలో వసూళ్లు చూడలేకపోవచ్చు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్