రాజమౌళి.. ఇప్పుడు కొత్తగా ఆలోచించాలి:వర్మ

సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సినిమాల జోరు పెంచారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా సినిమాల విడుదల ఆగిపోయింది

Updated : 20 Jul 2020 10:44 IST

హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ సినిమాల జోరు పెంచారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా సినిమాల విడుదల ఆగిపోయింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించినా చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే చిత్రాలు షూటింగ్‌లు జరుపుకొంటున్నాయి. అయితే, రాంగోపాల్‌ వర్మ మాత్రం ఒక దాని తర్వాత ఒకటి వరుస చిత్రాలను విడుదల చేస్తూ, కొత్త చిత్రాలను ప్రకటిస్తూ ముందుకెళుతున్నారు. ఇటీవల ‘క్లైమాక్స్‌’, ‘నేక్డ్’, ‘కరోనా వైరస్‌’ వంటి చిత్రాలను నెటిజన్ల ముందుకు తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు ‘‘ పవర్ స్టార్’’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సందర్భంగా అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని ఉద్దేశించి రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘‘హే రాజమౌళి.. ప్రస్తుతం ప్రపంచమంతా ఆన్‌లైన్‌కు మారుతోంది. ఈ  పరిస్థితుల్లో అదే సరికొత్త మార్కెట్. ఇప్పుడంతా సరి కొత్తగా ఆలోచించడం కావాలి. మేమంతా ‘ఆర్ఆర్ఆర్’ట్రైలర్ కు డబ్బులు చెల్లించి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం’’ అని ట్వీట్ చేశారు. వర్మ చేసిన ట్వీట్ పై ఇంకా రాజమౌళి స్పందించలేదు.
గతంలోనూ వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ నడిచిన సంగతి తెలిసిందే. అవన్నీ నెటిజన్లను అలరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని