నటి ఫిర్యాదు.. అనురాగ్ కశ్యప్పై కేసు నమోదు
అనురాగ్ కశ్యప్పై ముంబయి పోలీసులు రేప్ కేసు..
ముంబయి: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్పై ముంబయి పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. శనివారం ఓ ట్వీట్లో తనను బలవంతం చేశాడంటూ ఆరోపించిన నటి మంగళవారం రాత్రి లాయర్తో కలిసివెళ్లి వెర్సోవా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా దర్శకుడు, నిర్మాతపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2013లో వెర్సోవాలోని యారి ప్రాంతంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డట్లు నటి ఫిర్యాదులో పేర్కొంది. కాగా విచారణకు హాజరు కావాల్సిందిగా త్వరలోనే కశ్యప్కు నోటీసులు జారీచేయనున్నట్లు ఓ పోలీసు అధికారి న్యూస్ ఏజెన్సీ పీటీఐకి వెల్లడించారు. సదరు నటి శనివారం ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ అనురాగ్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అతడిని అరెస్టు చేయాలంటూ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన జాతీయ కమిషన్ మహిళా చీఫ్ రేఖా శర్మ పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాల్సిందిగా సదరు నటిని కోరారు.
నటి ట్వీట్పై స్పందించిన అనురాగ్ కశ్యప్ ఆమె ఆరోపణలను ఖండించాడు. అవన్నీ నిరాధారమైనవిగా పేర్కొంటూ పలు ట్వీట్లు చేశాడు. తప్పుడు ఆరోపణలతో తీవ్రంగా కలతచెందానని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా తన లాయర్తో కలిసి ముందుకెళతానని అన్నాడు. కాగా ఆ నటికి కంగనా రనౌత్ మద్దతు తెలిపి అనురాగ్ కశ్యప్ను అరెస్టు చేయాల్సిందిగా కోరింది. పలువురు నటీమణులు కశ్యప్కు మద్దతుగా నిలిచారు. నటి, కశ్యప్ మాజీ భార్య కల్కి కొచ్లిన్, తాప్సి, హ్యూమా ఖురేషి అతడు మహిళలను ఎంతో గౌరవిస్తాడని, అలాంటి తప్పు చేసేవాడు కాదంటూ మద్దతు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
ఆడపిల్ల ఉన్న ప్రతి కుటుంబానికీ నచ్చే చిత్రం
సుమన్ తేజ్, గరీమ చౌహాన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సీతా కళ్యాణ వైభోగమే’. సతీష్ పరమవేద దర్శకత్వం వహించగా, రాచాల యుగంధర్ నిర్మించారు -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?