గోవాకు పయనమైన ‘క్రాక్’ టీమ్
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’టీమ్ గోవాకు పయనమైంది. ఫైనల్ షెడ్యూల్లో భాగంగా హీరో రవితేజ, హీరోయిన్ శృతీహసన్ మధ్య ఓ పాట చిత్రీకరించనున్నారు. ఈ పాటతో దాదాపు సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తికానుంది. ఈ చిత్రానికి గోపీచంద్మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.
హైదరాబాద్: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ‘క్రాక్’టీమ్ గోవాకు పయనమైంది. ఫైనల్ షెడ్యూల్లో భాగంగా హీరో రవితేజ, హీరోయిన్ శృతీహసన్ మధ్య సముద్ర తీరంలో ఓ పాట చిత్రీకరించనున్నరట. ఈ పాటతో దాదాపు సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తికానుంది. ఈ చిత్రానికి గోపీచంద్మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రబృందం ఇప్పటికే ఓ మాస్ సాంగ్ను విడుదల చేసింది. ‘భూమ్ బద్దలు.. భూమ్ బద్దలు.. నా ముద్దుల సౌండు’ అంటూ సాగే ఈ పాట అది అభిమానులను బాగానే ఆకట్టుకుంది.
రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు అభిమానుల నుంచి మంచి మార్కులు కొట్టేశాయి. వీరిద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ‘క్రాక్’పై భారీ అంచానాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్, సముద్రఖని కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు తమన్ బాణీలు అందిస్తున్నారు. 2021లో సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా తర్వాత రవితేజ కోసం మరో సినిమా సిద్ధంగా ఉంది. ‘క్రాక్’ చిత్రీకరణ ముగియగానే ఆయన ‘ఖిలాడి’ సెట్లో కాలుపెట్టనున్నారు. దానికి రమేశ్వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను కూడా చిత్రబృందం ఇప్పటికే విడుదల చేసింది. దానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిచనున్నారు.
ఇదీ చదవండి..
మాస్ మహారాజ్.. మాస్ బీట్ వచ్చేసింది!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..