వాటి నుంచి నన్ను కాపాడండి: రియా
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పలు మీడియా కథనాలు తనని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయని...
దిల్లీ/ముంబయి: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పలు మీడియా కథనాలు తనని దోషిగా చూపే ప్రయత్నాలు చేస్తున్నాయని, వాటి వల్ల తన వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతోందని, అటువంటి కథనాల నుంచి తనని కాపాడాలని కోర్టును అభ్యర్థించారు. అలానే రాజకీయ అజెండాలో తాను బలిపశువు అవుతానేమోనని భయపడుతున్నట్లు అందులో వెల్లడించారు.
గత నెల రోజుల్లో నటులు అశుతోష్ భాక్రే, సమీర్ శర్మ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారనీ, వారి మరణాల గురించి ఎలాంటి ప్రచారాలు రాలేదని అన్నారు. కానీ సుశాంత్ కేసులో మాత్రం తనను దోషిగా చూపిస్తూ మీడియా కథనాలు వెలువడుతున్నాయనీ రియా పిటిషన్లో పేర్కొన్నారు. అలానే పట్నాలో తనపై నమోదైన కేసుకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. అలానే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు విచారించడాన్ని ఆమె తప్పుబట్టారు. మహారాష్ట్రలో ఘటన జరిగితే, ఆ కేసు విచారణకు బిహార్ ముఖ్యమంత్రి సీబీఐని ఎలా ఆహ్వానిస్తారని ఆమె ప్రశ్నించారు. పట్నాలో తన మీద నమోదైన కేసును ముంబయికి మార్చాలని కోరుతూ రియా గతంలో ఒకసారి సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా మీడియా సంస్థలపై ఆరోపణలు చేస్తూ ఆమె సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
సుశాంత్ ఆత్మహత్యకు రియా చక్రవర్తి, ఆమె కుటుంబసభ్యులేనని ఆరోపిస్తూ ఆయన తండ్రి పట్నా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అలానే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పట్నాలో నమోదైన కేసు ఆధారంగా సీబీఐ రియాతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరోవైపు ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు పలువురిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం మరోమారు ఆమె ఈడీ ముందు హాజరయ్యారు.
దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ
దిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి సోమవారం ఉదయం మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట దర్యాప్తునకు హాజరైంది. తన సోదరుడు షోవిక్తో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చింది. నటుడు సుశాంత్సింగ్ తండ్రి ఫిర్యాదు మేరకు బిహార్ పోలీసులు కేసు నమోదు చేయగా ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. శనివారం రియాను 8 గంటల పాటు విచారించిన ఈడీ, ఆమె సోదరుడు షోవిక్ను 18 గంటలపాటు ప్రశ్నించడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!