రియా చక్రవర్తికి మరో షాక్‌

బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తికి జ్యుడీషిల్‌ కస్టడీని పొడిగిస్తూ..

Updated : 22 Sep 2020 17:55 IST

నటికి కస్టడీని పొడిగించిన ప్రత్యేక కోర్టు

ముంబయి: బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తికి మరో షాక్‌. ఆమె జ్యుడీషియల్‌ కస్టడీని అక్టోబర్ 6వ తేదీ వరకు పొడిగిస్తూ నార్కోటిక్‌ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న రియా నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సెప్టెంబర్‌ 8న రియాను అరెస్టు చేసింది. అనంతరం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. డ్రగ్స్‌ సరఫరాతో సంబంధం ఉన్న రియా సోదరుడు షోవిక్‌, పలువురు సుశాంత్‌ వ్యక్తిగత సిబ్బంది సహా మరికొంత మందిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. గతంలో వారు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకోగా ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని