దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్‌ సామాన్యులనే మాత్రమే కాదు....

Updated : 29 Jul 2020 21:44 IST

హైదరాబాద్‌: దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకీ ఉద్ధృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్‌ సామాన్యులనే మాత్రమే కాదు ప్రముఖులను సైతం వణికిస్తోంది. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో ప్రకటించారు. గత కొన్ని రోజుల క్రితం తనతో పాటు కుటుంబ సభ్యులకు స్వల్పంగా జ్వరం వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పరీక్షలు చేయించుకోగా.. ఇవాళ కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆయన వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు చెప్పారు. తమ కుటుంబంలో ఎవరికీ కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తున్నట్టు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని