చిరు సోదరిగా సాయిపల్లవి?

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కనున్న ఓ సినిమాలో యువ కథానాయిక సాయిపల్లవి అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘సైరా’ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సినిమాల విషయంలో చిరు జోరు పెంచారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆయన త్వరలో బాబీ, సుజీత్‌, మెహర్‌ రమేష్‌లతో...

Published : 12 Sep 2020 13:40 IST

జోరుగా సాగుతోన్న ప్రచారం

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కనున్న ఓ సినిమాలో యువ కథానాయిక సాయిపల్లవి అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ‘సైరా’ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సినిమాల విషయంలో చిరు జోరు పెంచారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ఆయన త్వరలో బాబీ, సుజీత్‌, మెహర్‌ రమేష్‌లతో సినిమాలు చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మలయాళీ సినిమా ‘లూసిఫర్‌’ రీమేక్‌ పనులు జరుగుతున్నాయి. మరోవైపు తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ‘వేదాళం’ రీమేక్‌లో చిరు నటించనున్నట్లు గత కొన్నిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా మెహర్‌ రమేష్‌ ఈ రీమేక్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, తాజా సమాచారం.. ‘వేదాళం’ సినిమాలో అజిత్‌తోపాటు అతని సోదరిగా నటించిన లక్ష్మీ మేనన్‌ పాత్ర కూడా ఎంతో కీలకమైనది. దీంతో సదరు పాత్రకి సాయిపల్లవి అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తుందట. అయితే సాయిపల్లవి సైతం సోదరి పాత్ర చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. 

ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ పనుల్లో బిజీగా ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. మరోవైపు సాయిపల్లవి సైతం నాగచైతన్య కథానాయకుడిగా రానున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో నటిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ తిరిగి ప్రారంభమైంది. దీనితోపాటు ఆమె రానాతో కలిసి ‘విరాటపర్వం’ కోసం పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని