Sai tej: తెరసాప జార్‌సే.. పడవింక జోర్‌సే

సాయితేజ్‌ హీరోగా దేవ్‌ కట్టా తెరకెక్కిస్తున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘రిపబ్లిక్‌’. జీ స్టూడియోస్‌తో కలిసి జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. మణిశర్మ   స్వరాలందించారు. ఇందులోని

Updated : 07 Sep 2021 06:31 IST

సాయితేజ్‌ హీరోగా దేవ్‌ కట్టా తెరకెక్కిస్తున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘Republic’. జీ స్టూడియోస్‌తో కలిసి జె.భగవాన్‌, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. మణిశర్మ   స్వరాలందించారు. ఇందులోని రెండో గీతాన్ని సోమవారం విడుదల చేశారు. ‘‘జోర్‌సే బార్‌సే తెరసాప జార్‌సే.. పడవింక జోర్‌సే’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ పాటకు సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యమందించగా.. అనురాగ్‌ కులకర్ణి, సాకి శ్రీనివాస్‌, బరిమి శెట్టి సంయుక్తంగా ఆలపించారు. సాయితేజ్‌ ఈ చిత్రంలో పంజా అభిరామ్‌ అనే ఐఏఎస్‌ అధికారిగా  కనిపించనున్నారు.  జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.  సుకుమార్‌ ఛాయాగ్రాహకుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని