సమంత కొత్త ఛాలెంజ్‌.. ఆలస్యమైందన్న రానా

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో టాలీవుడ్‌ కథానాయిక సమంత మిద్దెపై వ్యవసాయం చేస్తున్న

Published : 21 Aug 2020 02:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో టాలీవుడ్‌ కథానాయిక సమంత మిద్దెపై వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. పోషక విలువలు కలిగిన మొక్కలను పెంచుతూ అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సమంత ‘గ్రో విత్‌ మి’ అనే ఛాలెంజ్‌ను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మంచు లక్ష్మి విసిరారు. ఎవరికి వారే తమ ఆహారాన్ని పండించుకోవాలన్నారు.

‘‘మరికొన్ని వారాల పాటు కలిసి పండించుకుందాం. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుందాం. ఒక కుండీ, కొద్దిగా మట్టి, విత్తనాలు, ఖాళీ పాల ప్యాకెట్ ఉన్నా సరే. ఇప్పుడు పని మొదలు పెట్టండి. లక్ష్మి మంచు, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను నామినేట్‌ చేస్తున్నా’’ అని పేర్కొన్నారు.

ఇక భళ్లాలదేవుడు రానా ఎట్టకేలకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేశారు. ప్రభాస్‌, శ్రుతిహాసన్ విసిరిన ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేయడం కాస్త ఆలస్యమైందన్నారు. తన అభిమానులందరికీ ఈ ఛాలెంజ్‌ విసురుతున్నట్లు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని