Sammathame: బుల్లెట్‌లా... నేనొస్తున్నానే

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా యు.జి.ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సమ్మతమే’. చాందిని చౌదరి కథానాయిక. గోపీనాథ్‌ రెడ్డి  దర్శకత్వం వహిస్తున్నారు.  కంకణాల ప్రవీణ్‌ నిర్మాత. సంగీత ప్రధానమైన రొమాంటిక్‌

Updated : 18 Mar 2022 09:09 IST

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా యు.జి.ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సమ్మతమే’. చాందిని చౌదరి కథానాయిక. గోపీనాథ్‌ రెడ్డి  దర్శకత్వం వహిస్తున్నారు.  కంకణాల ప్రవీణ్‌ నిర్మాత. సంగీత ప్రధానమైన రొమాంటిక్‌ ప్రేమకథతో రూపొందుతున్న ఈ సినిమాలోని ‘బుల్లెట్‌ లా... నీవైపే నేనొస్తున్నానే’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. సామ్రాట్‌ సాహిత్యం అందించారు. రితేశ్‌ జి.రావ్‌ ఆలపించారు. శేఖర్‌ చంద్ర స్వరకర్త. ‘‘విభిన్నమైన కథ ఇది.   సరికొత్త నేపథ్యంలో సాగుతుంది. ఇందులో సంగీతం కీలక పాత్ర పోషిస్తుంది. తొలి పాటకి ఎంత స్పందని వచ్చిందో, రెండో పాటకూ అదే స్థాయిలో ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని తెలిపాయి సినీ వర్గాలు. ఛాయాగ్రహణం: సతీష్‌రెడ్డి మాసం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని