గాయని సునీత నిశ్చితార్థం
గాయని సునీత మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపునేనిని ఆమె పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో సునీత-రామ్ల నిశ్చితార్థం వేడుకగా జరిగింది...
హైదరాబాద్: గాయని సునీత మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపునేనిని ఆమె పెళ్లి చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో సునీత-రామ్ల నిశ్చితార్థం వేడుకగా జరిగింది. నిశ్చితార్థం గురించి తెలియజేస్తూ తాజాగా సునీత ఫేస్బుక్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రతి తల్లిలాగానే నేను కూడా నా పిల్లలు చక్కగా జీవితాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను. అదే సమయంలో నేనూ జీవితంలో సంతోషంగా స్థిరపడాలని ఆశించే అందమైన తల్లిదండ్రులు, పిల్లలు నాకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. నా జీవితంలో అలాంటి మధుర క్షణం ఆసన్నమైంది. సంరక్షించే స్నేహితుడిగా.. అద్భుతమైన సహచరుడిగా రామ్ నా జీవితంలోకి ప్రవేశించాడు. మేమిద్దరం అతిత్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచానని అర్థం చేసుకున్న వారందరికీ కృతజ్ఞతలు. ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నా’ అని సునీత పేర్కొన్నారు.
తెలుగమ్మాయి అయిన సునీత గాయనిగా చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘ఈవేళలో నీవూ’ అంటూ తొలిపాటతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పటివరకూ దాదాపు కొన్నివందల పాటలు పాడారు. ‘మురారి’, ‘తమ్ముడు’, ‘ఊహలు గుసగుసలాడే’, ‘నేనున్నాను’, ‘బాస్’, ‘మహానటి’.. ఇలా ఎన్నో చిత్రాలకు ఆమె పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం కోసం సునీత పాడిన ‘నీలి నీలి ఆకాశం’ పాట ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించింది. గాయనిగానే కాకుండా ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా అలరించారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..